Road Accidents: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
ఖమ్మం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లా వైరా పట్టణం రింగ్ రోడ్డు సెంటర్ లో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటన శనివారం జరిగింది.
- By Gopichand Published Date - 10:11 AM, Sat - 25 March 23
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లా వైరా పట్టణం రింగ్ రోడ్డు సెంటర్ లో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటన శనివారం జరిగింది. సత్తుపల్లికి చెందిన రంగా సుభాష్, రోజా దంపతులు వైరా రింగ్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సత్తుపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న సుభాష్, రోజా దంపతులు స్థానిక వైరా రింగ్ సెంటర్ రాగానే వెనుక నుంచి వచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కాగా వీరు హైదరాబాద్ లో కిరాణా షాప్ నడుపుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ ఫ్లైఓవర్పై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ మీద ఉన్న రెయిలింగ్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముదిగొండ మండలం మేడిపల్లికి చెందిన పంగిళ్ల ఉదయ్ కుమార్, పోతునూక శివ, పోలగాని రవీంద్ అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మేడిపల్లి నుంచి ఖమ్మం చర్చి కాంపౌండ్కు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Related News
KTR : శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు..ఆయన అందరివాడు – కేటీఆర్
శ్రీరాముడు (Sriramudu) పేరు చెప్పి బిజెపి (BJP) రాజకీయాలు చేస్తుందని..శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) చెప్పుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ (Chevella MP Candidate Kasani Gnaneshwar Nomination) కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్�