Nationwide Strike: నేడు భారత్ బంద్.. మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ..!
యునైటెడ్ కిసాన్ మోర్చా ఫిబ్రవరి 16న అంటే శుక్రవారం భారత్ బంద్ (Nationwide Strike) ప్రకటించింది. ఈ భారత్ బంద్ గ్రామీణ భారతదేశంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
- By Gopichand Published Date - 06:36 AM, Fri - 16 February 24
Nationwide Strike: యునైటెడ్ కిసాన్ మోర్చా ఫిబ్రవరి 16న అంటే శుక్రవారం భారత్ బంద్ (Nationwide Strike) ప్రకటించింది. ఈ భారత్ బంద్ గ్రామీణ భారతదేశంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా ‘గ్రామీణ భారత్ బంద్’ నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు వెల్లడించాయి. తమ సమస్యలను ప్రజలకు వివరించి, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిపాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుండగా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల హైవేలపై ‘చక్కా జామ్’ను చేపట్టనున్నారు.
భారత్ బంద్కు కాంగ్రెస్ మద్దతు: ఖర్గే
రైతులు, పౌర సంస్థలు ప్రకటించిన.. ‘‘గ్రామీణ భారత్ బంద్’’కు కాంగ్రెస్ మద్దతునిస్తోందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. దేశంలోని 62 కోట్ల మంది రైతులకు మోదీ ప్రభుత్వం అబద్ధాలు, మోసం, అణచివేత, అన్యాయం తప్ప మరేమీ ఇవ్వలేదని ఖర్గే మండిపడ్డారు. కాగా.. నేడు రైతులు, పౌరసంస్థలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: AP BJP: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి: పురంధేశ్వరి
శుక్రవారం ఏమి మూసివేయబడుతుంది?
ఫిబ్రవరి 16న కూరగాయలు, ఇతర పంటల సరఫరా, కొనుగోలు, అమ్మకాలు నిలిపివేస్తామని తొలుత రైతులు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లు, ధాన్యం మార్కెట్లు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు మూసివేయబడతాయి. అంతేకాకుండా నగరాల్లోని దుకాణాలు, సంస్థలు కూడా మూసివేయబడతాయి. కానీ ఇప్పుడు చాలా వ్యాపార సంస్థలు ఈ బంద్కు దూరంగా ఉన్నాయి.
SKM ప్రకటన ప్రకారం.. ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలు కూడా నడవవు. అంబులెన్స్లు, వివాహ వాహనాలు, ఆసుపత్రులు, వార్తాపత్రికల వాహనాలు, పరీక్షలకు వెళ్లే విద్యార్థుల వాహనాలు, ఇతర అత్యవసర సేవల కోసం మాత్రమే మార్గం ఇవ్వనున్నారు.
We’re now on WhatsApp : Click to Join
Related News
Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు
Raghunandan Rao:మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ జరిగిన కిసాన్ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రెవంత్రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు. We’re now