HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Farmers Protest Security Tightened At Shambhu Border As Farmers Begin Dilli Chalo March

Farmers Protest: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అడ్డుకునేందుకు పోలీసులు ప‌టిష్ట చ‌ర్య‌లు!

సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతులతో కూడిన బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది. రైతులు ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి పార్లమెంటును చుట్టుముట్టాలని యోచిస్తున్నారు.

  • By Gopichand Published Date - 10:25 AM, Sun - 8 December 24
  • daily-hunt
Farmers Protest
Farmers Protest

Farmers Protest: హర్యానాలోని శంభు సరిహద్దులో ఆందోళన చేస్తున్న పంజాబ్ రైతులు (Farmers Protest) ఇవాళ మళ్లీ ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో హర్యానా పోలీసులు వారిని ముందుకు సాగకుండా నిరోధించడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేశారు. రైతులను శంభు సరిహద్దు దాటనివ్వకూడదని ఆదేశాలు ఉన్నాయి. దీంతో అంబాలాలో సెక్షన్ 144, సెక్షన్ 163 అమలులో ఉన్నాయి. డిసెంబర్ 9 వరకు ఇంటర్నెట్ సేవ మూసివేయబడింది.

సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతులతో కూడిన బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది. రైతులు ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి పార్లమెంటును చుట్టుముట్టాలని యోచిస్తున్నారు. అయితే ఈరోజు పాదయాత్రకు ముందు రైతులు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం కానున్నారు. సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోతే 101 మంది రైతులు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Also Read: Weekly Horoscope : డిసెంబరు 9 నుంచి 15 వరకు వారఫలాలు.. మంగళ, బుధవారాల్లో ఆ రాశుల వారికి అలర్ట్

శంభు సరిహద్దు వద్ద పోలీసులు బందోబ‌స్తు

మీడియా నివేదికల ప్రకారం.. డిసెంబర్ 8న ఢిల్లీకి రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మార్చ్ ప్రకటించడంతో హర్యానా పోలీసులు యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు. అంబాలా, ఢిల్లీ-హర్యానా సరిహద్దు, జింద్‌లోని డేటా సింగ్‌వాలా సరిహద్దు, ఖనౌరీ సరిహద్దు, సిర్సాలోని దబ్వాలి సమీపంలోని పంజాబ్-రాజస్థాన్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శంభు సరిహద్దులోని రోడ్లపై పోలీసులు మేకులు వేశారు. ఆ తర్వాత కాంక్రీట్‌ గోడను నిర్మించారు. దీని తరువాత అడ్డంకులు, బ్రేకర్లు ఇన్స్టాల్ చేశారు. పోలీసు బలగాలు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ క్యానన్లు, అల్లర్ల నియంత్రణ వాహనాలతో మోహరించారు. మూడంచెల భద్రతతో రైతులను శంభు బోర్డు వరకు పరిమితం చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

సర్వన్ సింగ్ పంధేర్ ప్రకటన వెలువడింది

మీడియా కథనాల ప్రకారం.. రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధర్ ఢిల్లీకి పాదయాత్రకు పిలుపునిచ్చారు. రైతు పోరాట దీక్షకు నేటికి 300 రోజులు పూర్తవుతున్నాయన్నారు. రైతులు శాంతియుతంగా కాలినడకన ఢిల్లీకి పాదయాత్ర చేస్తారన్నారు. రైతులను ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలన్న సందేశం రాలేదు. మోడీ సర్కార్ చర్చల మూడ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. డిసెంబర్ 6న కూడా రైతులు ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో జరిగిన ఘర్షణలో 16 మంది రైతులు గాయపడ్డారు. వీరిలో నలుగురు రైతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chalo Delhi
  • farmers
  • farmers protest
  • Farmers Protest 2.0
  • Kisan Andolan
  • national news
  • pm modi
  • police
  • protest
  • Shambhu Border

Related News

Assam

Assam: అస్సాంలో సంచలన నిర్ణయం.. బహుభార్యత్వంపై నిషేధం బిల్లు ఆమోదం!

బహుభార్యత్వాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని బిల్లు ప్రతిపాదించింది. ఈ నేరానికి పాల్పడిన వారికి చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించబడవచ్చు.

  • Pensioners

    Pensioners: పెన్షనర్లకు శుభవార్త.. రూ. 1,000 నుండి రూ. 9,000 వరకు పెరిగే అవకాశం!

  • Ayodhya

    Ayodhya: ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య.. రియల్ ఎస్టేట్‌లో నూతన శకం!

  • Rare Earths Scheme

    Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!

  • Delhi Blast Case

    Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!

Latest News

  • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

  • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

  • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

  • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

  • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

Trending News

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd