HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Farmers Protest Security Tightened At Shambhu Border As Farmers Begin Dilli Chalo March

Farmers Protest: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అడ్డుకునేందుకు పోలీసులు ప‌టిష్ట చ‌ర్య‌లు!

సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతులతో కూడిన బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది. రైతులు ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి పార్లమెంటును చుట్టుముట్టాలని యోచిస్తున్నారు.

  • By Gopichand Published Date - 10:25 AM, Sun - 8 December 24
  • daily-hunt
Farmers Protest
Farmers Protest

Farmers Protest: హర్యానాలోని శంభు సరిహద్దులో ఆందోళన చేస్తున్న పంజాబ్ రైతులు (Farmers Protest) ఇవాళ మళ్లీ ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో హర్యానా పోలీసులు వారిని ముందుకు సాగకుండా నిరోధించడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేశారు. రైతులను శంభు సరిహద్దు దాటనివ్వకూడదని ఆదేశాలు ఉన్నాయి. దీంతో అంబాలాలో సెక్షన్ 144, సెక్షన్ 163 అమలులో ఉన్నాయి. డిసెంబర్ 9 వరకు ఇంటర్నెట్ సేవ మూసివేయబడింది.

సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతులతో కూడిన బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది. రైతులు ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి పార్లమెంటును చుట్టుముట్టాలని యోచిస్తున్నారు. అయితే ఈరోజు పాదయాత్రకు ముందు రైతులు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం కానున్నారు. సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోతే 101 మంది రైతులు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Also Read: Weekly Horoscope : డిసెంబరు 9 నుంచి 15 వరకు వారఫలాలు.. మంగళ, బుధవారాల్లో ఆ రాశుల వారికి అలర్ట్

శంభు సరిహద్దు వద్ద పోలీసులు బందోబ‌స్తు

మీడియా నివేదికల ప్రకారం.. డిసెంబర్ 8న ఢిల్లీకి రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మార్చ్ ప్రకటించడంతో హర్యానా పోలీసులు యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు. అంబాలా, ఢిల్లీ-హర్యానా సరిహద్దు, జింద్‌లోని డేటా సింగ్‌వాలా సరిహద్దు, ఖనౌరీ సరిహద్దు, సిర్సాలోని దబ్వాలి సమీపంలోని పంజాబ్-రాజస్థాన్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శంభు సరిహద్దులోని రోడ్లపై పోలీసులు మేకులు వేశారు. ఆ తర్వాత కాంక్రీట్‌ గోడను నిర్మించారు. దీని తరువాత అడ్డంకులు, బ్రేకర్లు ఇన్స్టాల్ చేశారు. పోలీసు బలగాలు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ క్యానన్లు, అల్లర్ల నియంత్రణ వాహనాలతో మోహరించారు. మూడంచెల భద్రతతో రైతులను శంభు బోర్డు వరకు పరిమితం చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

సర్వన్ సింగ్ పంధేర్ ప్రకటన వెలువడింది

మీడియా కథనాల ప్రకారం.. రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధర్ ఢిల్లీకి పాదయాత్రకు పిలుపునిచ్చారు. రైతు పోరాట దీక్షకు నేటికి 300 రోజులు పూర్తవుతున్నాయన్నారు. రైతులు శాంతియుతంగా కాలినడకన ఢిల్లీకి పాదయాత్ర చేస్తారన్నారు. రైతులను ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలన్న సందేశం రాలేదు. మోడీ సర్కార్ చర్చల మూడ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. డిసెంబర్ 6న కూడా రైతులు ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో జరిగిన ఘర్షణలో 16 మంది రైతులు గాయపడ్డారు. వీరిలో నలుగురు రైతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chalo Delhi
  • farmers
  • farmers protest
  • Farmers Protest 2.0
  • Kisan Andolan
  • national news
  • pm modi
  • police
  • protest
  • Shambhu Border

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Bomb Threat

    Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • Tablighi Jamaat

    Tablighi Jamaat: తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు ఊరట.. ఐదేళ్ల తర్వాత క్లీన్ చిట్!

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd