Assembly Elections 2023: అమిత్ షాపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
అక్టోబర్ 16న ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం బుధవారం భారత ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది.
- Author : Praveen Aluthuru
Date : 25-10-2023 - 7:33 IST
Published By : Hashtagu Telugu Desk
Assembly Elections 2023: అక్టోబర్ 16న ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం బుధవారం భారత ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది.ప్రతినిధి బృందంలో రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, తెలంగాణకు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉన్నారు.భారత శిక్షాస్మృతి 1860, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని ఉల్లంఘిస్తూ హోంమంత్రి చేసిన ప్రకటనలు ఉద్దేశపూర్వకమైన చర్యలు అని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు మెమోరాండం దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలపై బురదజల్లడం ఆపేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ లో పేర్కొన్నారు. అలాగే మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా సుర్ఖీ నుంచి బీజేపీ అభ్యర్థి గోవింద్ సింగ్ రాజ్పుత్ను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరారు. బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చే ప్రభరీలకు రూ. 25 లక్షలు చెల్లిస్తానని రాజ్పుత్ బహిరంగంగా ప్రకటించారు. గోవింద్ సింగ్ రాజ్పుత్పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వారు కమిషన్కు తమ ఫిర్యాదులో సమర్పించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే బదిలీ చేసిన తెలంగాణలో పోలీసు అధికారుల అక్రమ బదిలీలు, పోస్టింగ్లపై కూడా వారు ఫిర్యాదు చేశారు.
Also Read: Telangana: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఐటీ శాఖ 24/7 అప్రమత్తం