Telangana: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఐటీ శాఖ 24/7 అప్రమత్తం
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న ఎన్నికల కోసం ఆదాయపు పన్ను శాఖ 'వ్యయ మానిటరింగ్ మెకానిజం'ను ఏర్పాటు చేసింది. ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహదూర్
- By Praveen Aluthuru Published Date - 07:14 PM, Wed - 25 October 23

Telangana: తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న ఎన్నికల కోసం ఆదాయపు పన్ను శాఖ ‘వ్యయ మానిటరింగ్ మెకానిజం’ను ఏర్పాటు చేసింది. ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహదూర్ మాట్లాడుతూ… ఎన్నికల విధుల కోసం 150 మంది ఆదాయపు పన్ను శాఖ అధికారులతో మొత్తం 33 జిల్లాల్లో క్యూఆర్టి (క్విక్ రెస్పాన్స్ టీమ్లు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వాహనంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు దొరికితే, ఏదైనా నేరం లేదా అభ్యర్థి ఏజెంట్ లేదా పార్టీ కార్యకర్తతో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉంటే అప్పుడు FST/SST నగదును స్వాధీనం చేసుకుంటుంది.
ఎన్నికల ప్రక్రియలో అక్రమంగా నగదుకు సంబంధించి సాధారణ ప్రజల నుంచి సమాచారం/ఫిర్యాదులను స్వీకరించేందుకు రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూమ్ మరియు ఫిర్యాదు పర్యవేక్షణ సెల్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ టోల్-ఫ్రీ నంబర్లకు తెలియజేయవచ్చు 1800-425-1785, ల్యాండ్లైన్ నంబర్. 040-23426201/23426202, వాట్సాప్/టెలిగ్రామ్ నంబర్. 7013711399, ఈ-మెయిల్ ఐడి: cleantelanganaelections@incometax.gov.
బేగంపేట విమానాశ్రయం మరియు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 24 x 7 నిఘా కోసం ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సీజర్ రిపోర్టుల వెరిఫికేషన్ కోసం ఈసీఐ ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) యాప్ను ఉపయోగిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుండి, రూ.53.93 కోట్ల నగదు 156 కేజీల బంగారు ఆభరణాలు మరియు 454 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నట్టు సదరు అధికారి తెలిపారు.
Also Read: Delhi pollution: వాయు కాలుష్యం నుంచి ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు