Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. పరుగులు తీసిన జనం
ఇండోనేషియాలో భూకంపం (Earthquake) సంభవించింది. ఇండోనేషియాలోని టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో సోమవారం భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్జిఎస్) నివేదించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది.
- By Gopichand Published Date - 09:15 AM, Tue - 24 January 23
ఇండోనేషియాలో భూకంపం (Earthquake) సంభవించింది. ఇండోనేషియాలోని టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో సోమవారం భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్జిఎస్) నివేదించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది. భూకంపం 23:47:34 (UTC+05:30)కి సంభవించింది. భూకంప కేంద్రం వరుసగా 2.881 అక్షాంశం , 127.100 రేఖాంశంలో భూకంపం సంభవించింది. USGS ప్రకారం.. సముద్ర మట్టానికి 12 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Also Read: 7 Killed : కాలిఫోర్నియాలో కాల్పులు కలకలం.. 7గురు మృతి
టోబెలో అనేది తూర్పు ఇండోనేషియా ద్వీపం హల్మహెరాలో ఉన్న ఒక నగరం. అంతకుముందు జనవరి 16న ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇండోనేషియాలోని సింగ్కిల్ నగరానికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తన వెబ్సైట్లో తెలిపింది. భూకంపం37 కి.మీ లోతులో నమోదైంది. ఇండోనేషియా, భారతదేశం పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఆగ్నేయాసియా, ఓషియానియాలో ఉన్న దేశం కావడం గమనార్హం. ఇందులో 17,000 కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్నాయి. రోజూ ఇక్కడ భూకంప ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి.
Related News
Indonesia: మూడు రోజుల్లో ఐదుసార్లు అగ్నిపర్వత విస్ఫోటనం.. నిరాశ్రయులైన 11వేల మంది
Indonesia: మరోసారి ఇండోనేషియాలో ఓ అగ్ని పర్వతం(Volcano Erupts) బద్దలైంది. ఉత్తర సలవేసి ప్రావీన్సులోని స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం మంగళవారం అర్ధరాత్రి ఒకసారి, బుధవారం తెల్లవారుజామున రెండు సార్లు విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఒక కిలోమీటర్ ఎత్తుకు లావా ఎగిసిపడినట్లు ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీలు తెలిపారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే వందల మందిని అధికారులు ఖాళీ చేయించారు. ఒ�