HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Chandrababu Reviews States Gross Domestic Product

AP : నాలుగు సూత్రాల ఆధారంగా పాలన కొనసాగితే అభివృద్ధి సాధించగలం: సీఎం చంద్రబాబు

సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ), కీ పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై ప్రణాళికా శాఖతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువు. పాలనలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచాలి. భవిష్యత్ విజన్‌తో ముందుకు సాగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Author : Latha Suma Date : 04-08-2025 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu reviews state's gross domestic product
CM Chandrababu reviews state's gross domestic product

AP : ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ విధానాల ధ్యేయంగా ఉండాలని, దానికి దార్శనికత, ప్రకృతి పరిరక్షణ, సాంకేతిక వినియోగం ప్రధాన ఆధారాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలు, విజన్, నేచర్, టెక్నాలజీ అనే నాలుగు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తేనే అత్యుత్తమ ఫలితాలు సాధించగలమని ఆయన తెలిపారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ), కీ పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై ప్రణాళికా శాఖతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువు. పాలనలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచాలి. భవిష్యత్ విజన్‌తో ముందుకు సాగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.

అలాగే పర్యావరణానికి హాని కలగకుండా పరిరక్షించే విధంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ, పారదర్శకత, వేగం, సామర్ధ్యాన్ని పెంపొందించాలి. ఈ నాలుగు మూల సూత్రాలను సమన్వయం చేస్తే పాలన అద్భుత ఫలితాలవైపు దారితీస్తుంది అని సీఎం పేర్కొన్నారు. ఆగస్టు 15 నుండి 700 రకాల ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇది ప్రజలకు వేగవంతమైన సేవలను చేరవేయడంలో కీలకం అవుతుందని పేర్కొన్నారు. టెక్నాలజీ వినియోగంతో పారదర్శకతను పెంచాలని సూచించారు.

2029 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ. 5.42 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ. 3,47,871గా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతీ శాఖ తమ పనితీరును కొలవడానికి నిర్దిష్ట ఇండికేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కేంద్ర స్థాయిలోని నీతి ఆయోగ్ మాదిరిగా రాష్ట్ర ప్రణాళికా శాఖ అన్ని విభాగాలను ముందుకు నడిపించాలని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం, మైనింగ్ వంటి రంగాల్లో విలువ జోడింపు (వాల్యూ ఎడిషన్)పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉద్యానవన పంటల ద్వారా రూ. 1.26 లక్షల కోట్లు, ఆక్వా ద్వారా రూ. 1.12 లక్షల కోట్ల జీవీఏ వసూలవుతోందని అధికారులు సీఎంకు వివరించారు.

కేవలం 60 లక్షల జనాభాతో, పరిమిత వనరులతో ఉన్న ఆ దేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మరి మనం 140 కోట్ల జనాభాతో, అపార వనరులతో ఎందుకు సాధించలేము? అని ప్రశ్నించారు. ఆర్టీజీఎస్ (Real-Time Governance) ద్వారా వచ్చే సమాచారాన్ని ఏకీకృతంగా విశ్లేషించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజల అవసరాలను ముందుగా అంచనా వేసి సేవల ను సమర్థంగా అందించవచ్చని చెప్పారు. ప్రభుత్వ శాఖలు ప్రతీ త్రైమాసికానికి పనితీరును సమీక్షించుకోవాలని సూచించారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని వారి ఆరోగ్యం, ఆదాయం వంటి అంశాలను డేటాబేస్‌లో నమోదు చేసి, ప్రభుత్వ పథకాలతో పాటు వారి ఆదాయాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: Central Govt : కాళేశ్వరం పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గింపును పరిశీలిస్తాం: కేంద్రం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • CM Chandrababu
  • good governance
  • GSDP
  • Key Performance Indicators
  • Poverty Reduction
  • state development
  • technology
  • Vision 2029

Related News

Sankranthi Toll Gate

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులకు బ్యాడ్ న్యూస్ !

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు

  • Magnum Wings Air Taxi

    వావ్ ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ !!

  • AI revolution in the Indian job market

    భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం

  • Amaravati

    అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం

  • Sankranti Affect Private Tr

    సంక్రాంతి ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్న ప్రవైట్ ట్రావెల్ కు రవాణా శాఖ భారీ షాక్

Latest News

  • ప్రభాస్ “రాజాసాబ్” ఫైనల్ టాక్

  • పాలకూర ప్రతిరోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు..!

  • మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

  • దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: పెట్టుబడిదారుల సంపదకు భారీ గండి

  • అమెరికా నౌకలను ముంచేస్తాం.. రష్యా ఎంపీ హెచ్చరికలు

Trending News

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd