AP : డీఐజీ రఘురామరెడ్డి తో మాట్లాడుతున్న చంద్రబాబు
- By Sudheer Published Date - 06:02 AM, Sat - 9 September 23
ప్రస్తుతం చంద్రబాబు బస్సు నుండి బయటకు వచ్చారు. డీఐజీ రఘురామరెడ్డి తో మాట్లాడుతున్నారు. అసలు ఏంజరుగుతుందో..? ఎందుకు వచ్చారు..? ఎందుకు అరెస్ట్ చేస్తారు..? మీ దగ్గర నన్ను అరెస్ట్ చేసేందుకు ఏ ఆధారాలు ఉన్నాయి..? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు..? ఏ నేరంలో ..తన వద్దకు వచ్చారు ..? మీరు అర్ధరాత్రి ఎందుకు రావాల్సి వచ్చింది..? నేను ఎక్కడికి పారిపోతున్నాను..? ఎఫైర్ లో నా పేరు లేదు..అయినప్పటికీ ఎందుకు అరెస్ట్ చేస్తారు..? అరెస్ట్ చేయడానికి ఏ ఆధారాలు ఉన్నాయి. అని చంద్రబాబు అడుగుతున్నారు. చంద్రబాబు ప్రశ్నలకు రఘురామరెడ్డి సమాదానాలు చెపుతున్నారు.
నంద్యాల వద్ద చంద్రబాబు ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్ధం కానీ పరిస్థితి..
అంగళూరు అల్లర్ల కేసు..?
పుంగనూరు అల్లర్ల కేసు..?
రాజధాని భూముల కేసు..?
స్కిల్ డెవలప్మెంట్ కేసు..?
2014 -2019 మధ్య తీసుకున్న నిర్ణయాల ఫై కేసు..?
ఇలా దీనిపై పోలీసులు చంద్రబాబు ను అరెస్ట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. అర్ధరాత్రి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు చంద్రబాబు బస చేసిన RK ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు చంద్రబాబు ను అరెస్ట్ చేస్తారనే సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నంద్యాల కు చేరుకున్నారు. దాదాపు మూడు గంటలుగా పోలీసులు RK ఫంక్షన్ హాల్ వద్ద వేచియున్నారు. కొద్దీ సేపటి క్రితం చంద్రబాబు కు మెడికల్ టెస్ట్ చేసేందుకు వైద్య బృందం చంద్రబాబు నిద్ర పోతున్న బస్ కాన్వాయ్ వద్దకు చేరుకున్నారు.
మరోపక్క చంద్రబాబు ఉండే ప్రాంతంలో ఎవర్నీ ఉంచడం లేదు. భూమా అఖిల ప్రియసహా ఇతర నాయకులను బయటకు పంపించేశారు. బలవంతంగా వారిని లాగిపడేస్తున్నారు. పోలీసులు చంద్రబాబు ను అరెస్ట్ చేసిన మా పోరాటం ఆగదు..ఈ సైకో ప్రభుత్వం దిగకమానదు అని టీడీపీ శ్రేణులు అంటున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నంద్యాలకు వస్తుండడం తో..ఎక్కడిక్కడే పోలీసులు వారిని అడ్డుకుంటూ అరెస్ట్ లు చేస్తున్నారు.
Related News
AP : టీడీపీకి ఓటు వేసాడని కార్యకర్త చెవిని కోసేసిన వైసీపీ నేత
రోడ్డుపై వెళ్తున్న తిమోతిపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తిమోతి చెవి తెగిపోయింది. గాయపడిన తిమోతిని కనిగిరి ఆసుపత్రిలో చేర్పించారు