Gujarat: గుజరాత్లో ఘోర ప్రమాదం.. 500 మంది గల్లంతు..!
గుజరాత్లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.
- Author : Gopichand
Date : 30-10-2022 - 7:43 IST
Published By : Hashtagu Telugu Desk
గుజరాత్లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి ప్రాంతంలోని కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి సుమారు 500 మంది పర్యాటకులు నదిలో పడి గల్లంతయ్యారు. ప్రభుత్వం సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. ఐదురోజుల క్రితమే అధికారులు ఈ బ్రిడ్జికి మరమ్మత్తులు చేసినట్లు సమాచారం.