HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bhatti Will Visit Khammam With Union Minister Shivraj Singh Chouhan

Bhatti Vikramarka : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో ఖమ్మంలో పర్యటించనున్న భట్టి

Bhatti Vikramarka will visit Khammam with Union Minister Shivraj Singh Chouhan : తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.

  • Author : Kavya Krishna Date : 06-09-2024 - 9:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhatti Vikramarka (3)
Bhatti Vikramarka (3)

Bhatti Vikramarka will visit Khammam with Union Minister Shivraj Singh Chouhan : తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు జరిగే ఏరియల్ సర్వేలో కేంద్ర మంత్రి చౌహాన్‌తో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఉంటారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర మంత్రి చౌహాన్‌కు వివరించనున్నారు.

Pawan Suffering From Fever : జ్వరాన్ని సైతం లెక్కచేయని పవన్…ప్రజలే ముఖ్యమంటూ సమీక్షలు

ఖమ్మం, మధిర, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పర్యటించనున్నారు. పంట నష్టాల గురించి ప్రత్యక్ష సమాచారాన్ని పొందడానికి అతను కొన్ని వ్యవసాయ క్షేత్రాలను కూడా చూస్తారు. కాసుమంచి మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతులతో కేంద్ర మంత్రి చౌహాన్ కూడా వారి సమస్యలను తెలుసుకుంటారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారుల బృందం కేంద్ర మంత్రి చౌహాన్‌తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనుంది. ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై పంట నష్టాన్ని అంచనా వేయనుంది. అయితే.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు.

ఉదయం 7:45 నిమిషాలకు హైదరాబాద్ ప్రజా భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరుతారు. ఉదయం 8 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో విజయవాడ కు బయలుదేరుతారు. విజయవాడలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్తో భేటీ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు హెలికాప్టర్లో మధిర నియోజకవర్గం కట్టలేరు ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన ఎర్రుపాలెం మండలం మీనవోలు, ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉప్పొంగడంతో ముంపునకు గురైన ప్రకాష్ నగర్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు.

ఉదయం 11:15 గంటలకు సూర్యాపేట జిల్లా మోతే మండలం సింగరేణి పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11:30 గంటలకు సింగరేణి పల్లి నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జూజులురావుపేట్ గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకొని నీట మునిగిన పంట పొలాలను, వర్షం నేపథ్యంలో దెబ్బతిన్న ఎన్ఎస్పి కెనాల్ ను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు పాలేరు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని ఖమ్మం జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ను తిలకిస్తారు. మధ్యాహ్నం 12:40 గంటలకు పాలేరు ట్యాంక్ బండ్ వద్ద వరద ముంపుతో నష్టపోయిన రైతులతో కేంద్రమంత్రి నేరుగా మాట్లాడుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సింగరేణి పల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ వద్దకు చేరుకుంటారు.

మధ్యాహ్నం 1:45 గంటలకు సింగరేణిపల్లి హెలీ ప్యాడ్ నుంచి హెలికాప్టర్ లో హైదరాబాదుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2: 30 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

Read Also : Court notices : కేసీఆర్, స్మితా సబర్వాల్‌కు కోర్టు నోటీసులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bhatti vikramarka
  • CM Revanth Reddy
  • Deputy CM Bhatti Vikramarka
  • Khammam floods
  • telangana floods
  • telangana rains
  • Union Minister Shivraj Singh Chouhan

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd