Ajit Pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్.. ఎన్సీపీ నేత తిరుగుబాటుకు కారణమేంటి..?
మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) తిరుగుబాటు చేసి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరారు.
- By Gopichand Published Date - 03:09 PM, Sun - 2 July 23
Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) తిరుగుబాటు చేసి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ఆదివారం (జూలై 2) రాజ్భవన్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజబల్ మహారాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్భవన్లో ఉన్నారు. మహారాష్ట్ర మాజీ హోం మంత్రులు దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే కూడా మహారాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. వార్తా సంస్థ ANIలోని మూలాల ప్రకారం.. అజిత్ పవార్తో పాటు రాజ్భవన్కు వెళ్లిన కొంతమంది ఎమ్మెల్యేలు పాట్నాలో జరిగిన ప్రతిపక్ష ఐక్య సమావేశంలో రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవాలని, ఆయనకు సహకరించాలని శరద్ పవార్ తీసుకున్న “ఏకపక్ష” నిర్ణయంపై కలత చెందారు.
అంతకముందు శరద్ పవార్పై అజిత్ పవార్ తిరుగు బావుటా ఎగుర వేశారు. తనకు మద్దతు ఇచ్చే 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్కు వెళ్లారు. శరద్ పవార్ తన కుమార్తె సుప్రియ సూలేకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. దీంతో తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కలేదని ఇన్నాళ్లుగా అజిత్ పవార్ భావించారు. చివరికి పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు.
Also Read: Biryani: ఇండియాలో ఈ 5 రకాల బిర్యానీలు ఫేమస్.. మీరు కూడా వీటిని ఒక్కసారి రుచి చూడాల్సిందే..!
బీజేపీ నేతలు స్వాగతం పలికారు
ప్రధాని మోదీ దార్శనికతకు మద్దతుగా ఈరోజు ఎన్సీపీ అజిత్ పవార్, ఆయనతో పాటు ఉన్న నేతలు వచ్చారని బీజేపీ మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే అన్నారు. ఈ సమీకరణం మహారాష్ట్రకు బలం చేకూర్చేలా ఉంది. ఈ సమీకరణం మహారాష్ట్రను ముందుకు తీసుకెళ్తుంది. బీజేపీకి మద్దతివ్వాలని నేషనలిస్ట్ పార్టీ నిర్ణయించిందని మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. మేము వారిని స్వాగతిస్తున్నాము. ఈరోజు ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు చేరారని తెలిపారు.
ఎన్సీపీ భేటీపై శరద్ పవార్ ఏం చెప్పారు?
అంతకుముందు అజిత్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశానికి పిలుపునిచ్చారు. దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. ఈ సమావేశాన్ని ఎందుకు పిలిచారో నాకు సరిగ్గా తెలియదని, అయితే ప్రతిపక్ష నేతగా తనకు (అజిత్ పవార్) శాసనసభ్యుల సమావేశాన్ని పిలిచే హక్కు ఉందని అన్నారు. ఈ సమావేశం గురించి నాకు పెద్దగా తెలియదని అన్నారు.
Related News
Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్10-11 లోక్సభ స్థానాలు గెలిస్తే తెలంగాణలో మళ్లీ ఏడాదిలోపే బీఆర్ఎస్ అధినేత కేసీఆరే సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.