HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >56k Crore Loan On Civil Supplies Department Minister Uttam Kumar

Minister Uttam Kumar: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌర సరఫరాల శాఖ: మంత్రి ఉత్తమ్ కుమార్

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు.

  • By Gopichand Published Date - 12:46 PM, Tue - 12 December 23
  • daily-hunt
Minister Uttam Kumar Reddy
Minister Uttam Kumar Reddy

Minister Uttam Kumar: తెలంగాణలో అధికారంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీపాలనపై పట్టు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ముఖ్య నేతలు తమకు కేటాయించిన శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సివిల్ సప్లయ్ శాఖ పని తీరును సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ, గిడ్డంగుల నిర్వహణ, రేషన్ వస్తువుల సరఫరా, తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లబ్దిదారులకు పీడీఎస్ బియ్యం అందకుండా డైవర్ట్ అయింది. 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెంచాల్సి ఉంది. రూ. 500కే గ్యాస్ సిలిండర్ ను 100 రోజుల్లో అమలు చేస్తాం. అన్ని శాఖల్లో ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. సివిల్ సప్లై కార్పొరేషన్ 11 వేల కోట్ల నష్టాల్లో ఉంది. పౌర సరఫరాల శాఖపై 56 వేల కోట్ల రుణం ఉంది. ఉన్న రేషన్ కార్డుల్లో బియ్యం తీసుకునేవారు 89 శాతం దాటలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.8 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామన్నారు.

Also Read: Voter Registration : ఓటరు నమోదు, సవరణలకు మరో ఛాన్స్

అయితే ప్రజలకు అందిస్తున్న రేషన్ సక్రమంగా వారికి చేరుతుందా, వాటిని ఉపయోగించుకుంటున్నారా అన్నది గమనించాలని అధికారులకు మంత్రి సూచించారు. కిలో 39 రూపాయలు పెట్టి సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని, కానీ అవి పేదలు తినకపోతే ఇంత గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందన్నారు. రాష్ట్రంలో సివిల్ సప్లయ్ శాఖ పనితీరును సమీక్షించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ, తదితర అంశాలపై ఉత్తమ్ కుమార్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Civil Supplies Department
  • gas cylinder
  • meeting
  • Minister Uttam Kumar Reddy
  • Ration News
  • telangana
  • ts news

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!

Latest News

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd