NDA Vote Share Decrease: ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓట్లు ఎక్కడ తగ్గాయో తెలుసా..?
- By Gopichand Published Date - 12:00 PM, Sat - 8 June 24
![NDA Vote Share Decrease: ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓట్లు ఎక్కడ తగ్గాయో తెలుసా..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/03/BJP-announces-manifesto-com.jpg)
NDA Vote Share Decrease: లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. బీజేపీ 240 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయే కూటమి 293 సీట్లు గెలుచుకుంది. దీంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా.. ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో ప్రధానిగా మోదీ మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మోదీ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. సీట్ల వ్యత్యాసానికి ఓట్ల శాతం పెరగడం, తగ్గడం ప్రధాన కారణం. బీజేపీకి సీట్లు తగ్గడానికి (NDA Vote Share Decrease).. కాంగ్రెస్ ముందంజలో ఉండడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు తగ్గడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల తగ్గుదల
సమాచారం ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ 35 శాతం ఓట్లను సాధించింది. ఇది ఇతర పార్టీల కంటే ఎక్కువ. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే 1 శాతం తగ్గుదల కనిపించింది. పార్టీ మిత్రపక్షాలు గ్రామీణ ప్రాంతాల్లో తమ ఓట్ల వాటాను 8 శాతంగా కొనసాగించాయి. ఇది గత ఎన్నికల కంటే పెద్దగా మార్పును సూచించలేదు. అంటే ప్రతి 100 మంది ఓటర్లలో 43 మంది ఎన్డీయేకు ఓటు వేశారు. కానీ ఈసారి ఇండియా కూటమి ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చింది.
Also Read: Jagan : రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి – జగన్ సంచలన ట్వీట్
గ్రామీణ ప్రాంతాల్లో ఎవరిని నమ్మారు?
2024 లోక్సభ ఎన్నికలలో గ్రామస్థులు కాంగ్రెస్పై కొంచెం ఎక్కువ విశ్వాసం వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్దతు స్వల్పంగా పెరిగింది. కాంగ్రెస్ గ్రామీణ ఓట్ల శాతం 21 శాతానికి పెరిగింది. ఇది 2019 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 2 శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు విపరీతమైన మద్దతు లభించింది. దీంతో వారికి గ్రామీణ ఓట్ల శాతం 13 శాతం పెరిగింది. 2019తో పోలిస్తే ఈసారి 21 శాతానికి చేరుకుంది. గణాంకాల ప్రకారం.. గత ఎన్నికల్లో 100 మంది ఓటర్లలో 29 మంది మాత్రమే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలను ఎన్నుకున్నారు. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లోని 100 మంది ఓటర్లలో 42 మంది ఇండియా కూటమికి అనుకూలంగా ఓటు వేశారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతా: సీఎం మమతా బెనర్జీ](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/NITI-Aayog-meeting_11zon.jpg)
NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతా: సీఎం మమతా బెనర్జీ
నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరవుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలన్నీ దూరమయ్యాయి. దీన్ని నేను అంగీకరించలేను. కాబట్టి మీటింగ్లో అందరి తరుపున నేనే గళం విప్పుతాను అని అన్నారు.