Siddaramaiah: ప్రజ్వల్ రేవణ్ణ ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేస్తా
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఏ దేశంలో ఉన్నా సరే అరెస్ట్ చేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖరాఖండిగా చెప్పారు.
- By Praveen Aluthuru Published Date - 09:46 AM, Sat - 4 May 24
Siddaramaiah: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఏ దేశంలో ఉన్నా సరే అరెస్ట్ చేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖరాఖండిగా చెప్పారు.
కర్ణాటకలో లైంగిక ఆరోపణల్లో చిక్కుకున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ. పార్లమెంట్ ఎన్నికల్లో జనతా కూటమి తరపున హసన్ నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేశారు. ఎన్నికల అనంతరం ఆయన జర్మనీ వెళ్లారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు విభాగం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అతన్ని వాంటెడ్ వ్యక్తిగా ప్రకటించి, అన్ని విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు పంపారు. ఈ విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ..ప్రజ్వల్ రేవణ్ణకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. అయితే అతను ఏ దేశంలో దాక్కున్నా అరెస్ట్ చేస్తామన్నారు సీఎం.
We’re now on WhatsApp : Click to Join
ప్రజ్వల్ రేవణ్ణ పాస్పోర్ట్ రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాశాన్నారు. అతనిపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న జనతాదళ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ ఘటనలో బాధిత మహిళలకు తగిన రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించానని అన్నారు.
Also Read:Addiction: మీకు ఈ రెండు వ్యసనాలు ఉన్నాయా..? అయితే కోలుకోవటం కష్టమే..!
Related News
Kanhaiya Kumar: పూలమాల వేస్తానంటూ కాంగ్రెస్ అభ్యర్థిపై చెప్పుతో దాడి
కాంగ్రెస్ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్పై శుక్రవారం ఇద్దరు యువకులు దాడి చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కన్హయ్య కుమార్ను ఈ యువకులు చెప్పుతో కొట్టారు. అయితే అక్కడే ఉన్న కన్హయ్య మద్దతుదారులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.