Union Cabinet Meeting: రేపు కేంద్ర క్యాబినెట్ సమావేశం.. ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక నిర్ణయాలు!
ప్రధాని మోదీ గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో బయోఫ్యూయల్స్, టెలికాం సేవలపై ఆదాయ గణన సవరణలు, రైల్వే భూముల లీజు వ్యవధి పెంపు వంటి నిర్ణయాలను ఆమోదించారు.
- Author : Gopichand
Date : 24-06-2025 - 5:58 IST
Published By : Hashtagu Telugu Desk
Union Cabinet Meeting: రేపు (జూన్ 25, 2025) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం (Union Cabinet Meeting) జరగనుంది. ఈ సమావేశంలో దేశ ఆర్థిక, భద్రతా, అభివృద్ధి సంబంధిత పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గత వారం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల క్యాబినెట్ సమావేశం జరగలేదు. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశంలో చర్చించే అంశాల్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) విస్తరణ, రైతులకు మద్దతు ధర (MSP) పెంపు, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ పాలసీ సవరణలు, రాష్ట్రాల్లో పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన 12 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు వంటి అంశాలు ఉండవచ్చని సమాచారం. అలాగే, ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా చర్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో బయోఫ్యూయల్స్, టెలికాం సేవలపై ఆదాయ గణన సవరణలు, రైల్వే భూముల లీజు వ్యవధి పెంపు వంటి నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమావేశంలో కూడా ఇలాంటి ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. క్యాబినెట్ సెక్రటేరియట్, రాష్ట్రాల మధ్య సమన్వయం, కొత్త విధానాల అమలుకు సహకరిస్తుంది.
Also Read: Jubilee Hills Bypolls : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధంగా ఉండాలి – కార్యకర్తలకు రేవంత్ పిలుపు
రేపు జరిగే సమావేశంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, గృహ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశం దేశ రాజకీయ, ఆర్థిక దిశను నిర్దేశించేందుకు కీలకమైనదిగా భావిస్తున్నారు.