HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >There Are No Permanent Friends Or Enemies National Interests Are Permanent Rajnath Singh

Modi China Tour : శాశ్వత మిత్రులు-శత్రువులంటూ ఏమీ ఉండదు..దేశ ప్రయోజనాలే శాశ్వతం: రాజ్‌నాథ్ సింగ్

ప్రపంచం వేగంగా మారుతోంది. ప్రతి దేశం తన ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాలు మార్చుకుంటోంది. అలాంటి పరిణామాల్లో మిత్రుడైనా, శత్రువైనా శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది కేవలం దేశ ప్రయోజనాలే అని ఆయన వ్యాఖ్యానించారు.

  • By Latha Suma Published Date - 12:28 PM, Sat - 30 August 25
  • daily-hunt
There are no permanent friends or enemies.. National interests are permanent: Rajnath Singh
There are no permanent friends or enemies.. National interests are permanent: Rajnath Singh

Modi China Tour : దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం లేదా శాశ్వత శత్రుత్వం అనే భావనకు తావులేదని, అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత ప్రయోజనాలే వాస్తవం అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జాతీయ మీడియాలో నిర్వహించిన ఒక ప్రముఖ సదస్సులో పాల్గొన్న ఆయన మారుతున్న గ్లోబల్ డైనమిక్స్, భారత్ స్వావలంబన దిశగా తీసుకుంటున్న అడుగులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రపంచం వేగంగా మారుతోంది. ప్రతి దేశం తన ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాలు మార్చుకుంటోంది. అలాంటి పరిణామాల్లో మిత్రుడైనా, శత్రువైనా శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది కేవలం దేశ ప్రయోజనాలే అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆత్మనిర్భరత అవసరమైంది

రాజ్‌నాథ్‌ సింగ్ మాట్లాడుతూ..భారత్ రక్షణ రంగంలో విదేశాలపై ఆధారపడడం అనేది ఈ రోజుల్లో వ్యూహాత్మకంగా సరికాదు. ఆత్మనిర్భర భారత్ే భవిష్యత్. రక్షణ రంగంలో స్వావలంబన మన ఆర్థిక వ్యవస్థ, భద్రత రెండు కోణాల్లోను అత్యవసరం. 2014లో మన రక్షణ ఎగుమతుల విలువ రూ.700 కోట్లే. ప్రస్తుతం అది రూ.24,000 కోట్లకు చేరుకుంది. ఇది భారత్ ఇక కొనుగోలుదారుగా కాకుండా, ఎగుమతిదారుగా మారుతుందని సూచిస్తోంది.

భౌగోళిక రాజకీయాల మలుపులు

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదుపరి పరిణామాలు, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం, అలాగే ప్రస్తుత మోడీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్‌ త‌న వ్యూహాలను మెల్లిగా మార్చుకుంటోందని ఆయన పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా, భారత్‌ను మిత్ర దేశంగా పేర్కొన్నప్పటికీ, ఒకవైపు భారత్‌పై సుంకాలు విధించడాన్ని మరిచిపోకూడదు. ముడి చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాతో సంబంధాలపై ఒత్తిడులు ఎదురయ్యాయి. ఇవే మారుతున్న అంతర్జాతీయ రాజకీయాలకు ఉదాహరణలు అని అన్నారు.

దేశ ప్రయోజనాలే లక్ష్యం

మన శత్రువు ఎవరు? మన మిత్రుడు ఎవరు? అనే ప్రశ్నలకన్నా… మన ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్న ముఖ్యం. రైతు, వ్యాపారవేత్త, శాస్త్రవేత్త, సైనికుడు అందరి ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా భావించాలి. వాటికే ప్రభుత్వం కట్టుబడి ఉండాలి.

స్వదేశీ శక్తితో భారత్ దూసుకుపోతోంది

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్వదేశీ ఆయుధ వ్యవస్థలు ఆధారంగా మన బలగాలు లక్ష్యాలపై అత్యంత కచ్చితంగా దాడులు జరిపిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు. ఈ విజయాలు దూరదృష్టికి, సమన్వయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి సన్నద్ధత లేకుండా ఎలాంటి మిషన్ సఫలీకృతం కాదు అని స్పష్టం చేశారు.

చైనా పర్యటనకు ప్రాధాన్యం

ఈ తరుణంలోనే, ఏడు ఏళ్ల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన చైనా పర్యటన విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. గడచిన కొన్ని సంవత్సరాల్లో చైనా-భారత్ సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, ఈ పర్యటనను వ్యూహాత్మక పరిణామంగా పరిగణిస్తున్నారు.

Read Also: Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో నుంచి గణేశ్ భక్తులకు శుభవార్త


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • Defence Minister Rajnath Singh
  • Defense sector
  • Eternal friendship.. eternal enmity
  • india
  • Permanent benefits
  • PM Modi China Tour

Related News

Pithapuram

Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం పిఠాపురంలోని కుక్కుటేశ్వరుడి దేవాలయంలో ఉండేది. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. Pithapuram Charitra : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం హాట్‌ టాపిక్‌. ఏ నోట విన్నా పిఠాపురం మాటే. ఈ పిఠాపురం.. కాకినాడ జిల్లాలో ఉంది. అయితే.. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపత

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Gen Z Protest Possible Ktr

    Gen Z Protest Possible In India : భారత్లోనూ జన్జ ఉద్యమం రావొచ్చు – కేటీఆర్

  • Trump Tariffs

    Trump Tariffs: భారత్-అమెరికా మధ్య టారిఫ్‌ తగ్గింపు?

  • TikTok

    TikTok: ట్రంప్ టిక్‌టాక్‌ను ఎందుకు పునరుద్ధరించాలని చూస్తున్నారు?

Latest News

  • Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రభుత్వానికి.. ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిస్థాయి స్వాధీనం

  • Man Ate Spoons: స్పూన్లు, టూత్‌ బ్రష్‌లు మింగిన వ్యక్తి: రిహాబ్‌ సెంటర్‌పై కోపంతో అర్థంలేని పని

  • Parijata: పారిజాత పూల రహస్యం: ఈ పుష్పాలను ఎవరు కోయకూడదో ఎందుకు తెలుసా?

  • SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

  • Car Brands Logo: సుజుకి కొత్త లోగో.. డిజిటల్ యుగంలో ఆటోమొబైల్ బ్రాండ్ల కొత్త వ్యూహం!

Trending News

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd