Rahul Gandhi Gets Bail: పరువు నష్టం కేసు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్
- Author : Gopichand
Date : 07-06-2024 - 11:43 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi Gets Bail: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి బెంగళూరు ప్రత్యేక కోర్టు బెయిల్ (Rahul Gandhi Gets Bail) మంజూరు చేసింది. ఈ కేసు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయిపై రాహుల్ గాంధీ కమీషన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీంతో బీజేపీ నేత రాహుల్పై కేసు పెట్టారు.
ఈ విషయమై బీజేపీ తరపు న్యాయవాది వినోద్ మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఓ ప్రకటనను ప్రచురించిందని, అందులో బీజేపీది ఇబ్బందికర ప్రభుత్వమని పేర్కొన్నారు. ఇది తప్పుడు ఆరోపణ. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. నిందితులకి బెయిల్ మంజూరైంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా నిందితులుగా ఉన్నారు. అయితే కోర్టు వారిద్దరికీ కూడా బెయిల్ మంజూరు చేసింది.
Also Read: OG Movie : భారీ ధరకు అమ్ముడుపోయిన పవన్ ‘ఓజి’ మూవీ ఓటీటీ రైట్స్.. ఎంతంటే..?
గతేడాది ప్రధాన స్రవంతి వార్తాపత్రికలలో కాంగ్రెస్ తప్పుడు ప్రకటనలు జారీ చేసిందని కర్ణాటక బీజేపీ ఆరోపించింది. ఆ ప్రకటనలో 2019-2023 మధ్య కాలంలో రాష్ట్రంలోని అప్పటి బిజెపి ప్రభుత్వం తన పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అన్ని పబ్లిక్ వర్క్స్ పనుల్లో 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపిస్తూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘కరప్షన్ రేట్ కార్డ్’ కూడా ప్రచురించిందని బిజెపి తన ఫిర్యాదులో పేర్కొంది. గత బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పరువు నష్టం కలిగించే ప్రచారం చేస్తోందని ఫిర్యాదుదారు ఆరోపించారు. రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో తన ఖాతాలో ఈ ‘అవమానకరమైన ప్రకటన’ పోస్ట్ చేశారని బీజేపీ ఆరోపించింది.
అంతకుముందు మార్చి 23, 2023న.. సూరత్ CJM కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనకు శిక్ష పడింది. ఆ మరుసటి రోజు 2023 మార్చి 24న లోక్సభ సెక్రటేరియట్ ఆయన సభ్యత్వాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలకు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడితే సభ్యత్వం కోల్పోతారు. రాహుల్ విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఆ తర్వాత రాహుల్కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. అతడి శిక్షపై కోర్టు స్టే విధించింది.
We’re now on WhatsApp : Click to Join