HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄India News
  • ⁄Pm Chairs Key All Party Meet To Strategise 2023 G20 Summit Several Cms In Attendance

G20 summit 2023: ప్రధాని అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశం.. సీఎం కేసీఆర్ డుమ్మా..!

భారత అధ్యక్షతన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సూచనలను

  • By Gopichand Published Date - 08:57 AM, Tue - 6 December 22
G20 summit 2023: ప్రధాని అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశం.. సీఎం కేసీఆర్ డుమ్మా..!

భారత అధ్యక్షతన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సూచనలను కోరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు పార్టీల సహకారాన్ని ఆయన కోరగా, ప్రతిపక్ష నాయకులు దేశ ప్రయోజనాల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇది యావత్ దేశం గర్వించదగ్గ సందర్భమని, దీని విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మోదీ అన్నారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కెసిఆర్ ను సమావేశానికి ఆహ్వానిస్తూ నవంబర్ 23న కేంద్రం నుంచి లేఖ అందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమావేశానికి తెరాస తరుపున ఎవరూ హాజరు కాలేదు. కాగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన జి20 సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

జి20కి ఇప్పుడు భారత్ సారథ్యం వహిస్తున్నందున రాజకీయ కోణంలో దీనిపై ప్రకటనలు చేయడం సరికాదన్నారు. అంతర్జాతీయ సమాజం భారత్‌ను జి20 నాయకుడిగా చూస్తున్న తరుణంలో మనమందరం ఏకతాటిపై నిలబడాలి అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, ఏక్నాథ్ షిండే, అరవింద్ కేజ్రీవాల్, జగన్ మోహన్ రెడ్డి, ఎం.కె. స్టాలిన్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు, తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం డిజిటల్ పరిజ్ఞానంపై దృష్టి సారించేందుకు కనీసం రాబోయే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేయాలని చంద్రబాబు చెప్పారు. దేశంలో అందుబాటులో ఉన్న బలమైన యువశక్తిని దృష్టిలో ఉంచుకుని డిజిటల్ పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించగలిగితే భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ లేదా టూ గా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వైపు నుండి, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. ఈ ఏడాది డిసెంబరు 1న ప్రారంభమైన భారత జి-20 అధ్యక్ష పదవి సందర్భంగా ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాల గురించి MEA పాల్గొనేవారికి వివరించినట్లు వర్గాలు తెలిపాయి. జి-20 సమ్మిట్‌కు ముందు దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో దాదాపు 200 సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కొంతమంది ప్రతిపక్ష నాయకులు భారతదేశం అధ్యక్ష పదవిని చేపట్టడం రొటేషన్ ద్వారా జరిగిందని, దానిని ప్రభుత్వ ఘనతగా అంచనా వేయకూడదని పేర్కొన్నారని వర్గాలు తెలిపాయి. అదే సమయంలో భారతదేశం G-20 ప్రెసిడెన్సీకి మద్దతుగా చేసిన ట్వీట్లకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా వివిధ ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు.

 

 

 

 

Tags  

  • AP CM Jagan
  • arvind kejriwal
  • cm kcr
  • g20 summit
  • G20 summit 2023
  • mallikarjun kharge
  • mamata banerjee
  • prime minister narendra modi
  • Rashtrapati Bhavan

Related News

KCR Strategy: కేసీఆర్ ‘ఢిల్లీ’ జిమ్మిక్కులు.. మోడీపై ఏడుగురు సీఎంలతో ‘ఢీ’

KCR Strategy: కేసీఆర్ ‘ఢిల్లీ’ జిమ్మిక్కులు.. మోడీపై ఏడుగురు సీఎంలతో ‘ఢీ’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

  • BRS Parliamentary Meeting: 29న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం!

    BRS Parliamentary Meeting: 29న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం!

  • CM KCR: కేసిఆర్ తో మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ రాజె భేటీ!

    CM KCR: కేసిఆర్ తో మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ రాజె భేటీ!

  • CM KCR: రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ డుమ్మా!

    CM KCR: రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ డుమ్మా!

  • Governor Tamilisai: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై పరోక్ష విమర్శలు.. అవి మాత్రమే అభివృద్ధి కాదంటూ..!

    Governor Tamilisai: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై పరోక్ష విమర్శలు.. అవి మాత్రమే అభివృద్ధి కాదంటూ..!

Latest News

  • NBK- PSPK: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్న.. ప్రోమో వైరల్!

  • Kiwis T20: కివీస్‌దే తొలి టీ ట్వంటీ

  • China: భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు.. షాకిస్తున్న నివేదిక!

  • Rajinikanth: రోజూ మద్యం తాగే రజినీకాంత్.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి!

  • Tarakaratna: తారకరత్న శరీరం రంగు నీలి రంగులోకి ఎందుకు మారిందంటే?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: