HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Operation Sindoor Pm Modi To Address The Nation At 8 Pm

Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

మే7న భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) నిర్వహించాయి.

  • By Pasha Published Date - 04:45 PM, Mon - 12 May 25
  • daily-hunt
Operation Sindoor
Operation Sindoor

Operation Sindoor : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య మే 10న మధ్యాహ్నం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనుండటం ఇదే తొలిసారి. భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌కు అండగా నిలిచినందుకు దేశ ప్రజలకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే) ముమ్మాటికీ భారత్‌దే.. పాక్ ఉగ్రవాదులకు భారత్‌కు అప్పగించాల్సిందే అనే అంశాలతో ప్రధాని మోడీ ప్రసంగం సాగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కశ్మీర్ అంశంలో మూడో దేశం జోక్యాన్ని అంగీకరించేది లేదని మోడీ తేల్చి చెప్పే ఛాన్స్ ఉంది.

మే 7 నుంచి ఏమేం జరిగాయి ? 

  • మే7న భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) నిర్వహించాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.
  • అప్పటి నుంచి మే 10న మధ్యాహ్నం వరకు భారత్, పాక్‌ సైన్యాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. పరస్పర దాడులు జరిగాయి.
  • శుక్రవారం (మే 9) రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారత్, పాకిస్తాన్‌లతో అమెరికా జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. ఇరుదేశాల ప్రభుత్వాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)ల స్థాయిలో చర్చలకు అంగీకారం తెలిపాయి.
  • దీంతో శనివారం మధ్యాహ్నం భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్ అపాయింట్‌మెంట్‌ను పాకిస్తాన్ డీజీఎంఓ కాశిఫ్ అబ్దుల్లా కోరారు. దీనికి భారత డీజీఎంఓ వెంటనే ఓకే చెప్పారు. పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చలు జరిపారు.
  • ఈ చర్చల వేళ పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనల వివరాలను భారత రక్షణశాఖకు డీజీఎంఓ రాజీవ్ ఘయ్ తెలిపారు. భారత రక్షణ శాఖ నుంచి ఈ సమాచారం భారత ప్రధాని మోడీ దాకా చేరింది. పాకిస్తాన్‌తో తక్షణ కాల్పుల విరమణకు భారత సర్కారు అంగీకారాన్ని తెలిపింది.
  • అనంతరం ఇదే సమాచారాన్ని పాకిస్తాన్ డీజీఎంఓకు భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్ చేరవేశారు.
  • ఈవిధంగా మే 10న సాయంత్రం 5 గంటల నుంచి తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ సమయం తర్వాత పాకిస్తాన్ సైన్యం పలుచోట్ల కాల్పులకు పాల్పడింది. తమ డ్రోన్లను భారత గగనతలం వైపుగా పంపింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • ఇక పాకిస్తాన్ ప్రతీ బుల్లెట్‌కు మిస్సైల్‌తో బలంగా జవాబు చెప్పాలని భారత సైన్యానికి ప్రధాని మోడీ ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ సైన్యాన్ని బలంగా ప్రతిఘటించేందుకు సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్మీ కమాండర్లకు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఫుల్ పవర్స్ కేటాయించారు. ఈ విషయం తెలియడంతో ఆదివారం రాత్రి సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ చడీచప్పుడు లేకుండా గడిపింది.
  • ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ చేయనున్న ప్రసంగం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • India DGMO
  • India vs Pakistan
  • Indian army
  • jammu kashmir
  • kashmir
  • narendra modi
  • Operation Sindoor
  • pakistan
  • pm modi
  • POK

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • Suryakumar

    SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • Railway Employees

    Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

Latest News

  • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

  • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

  • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

  • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd