Operation Kaveri: ఆపరేషన్ కావేరి.. భారత్ చేరుకున్న 360 మంది భారతీయులు
సూడాన్ (Sudan)లో అంతర్యుద్ధం మధ్య, అక్కడి నుండి భారతీయ పౌరులను తరలించడానికి ప్రభుత్వం భారత సైన్యం సహాయంతో ఆపరేషన్ కావేరి (Operation Kaveri) రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహిస్తోంది.
- By Gopichand Published Date - 06:34 AM, Thu - 27 April 23
సూడాన్ (Sudan)లో అంతర్యుద్ధం మధ్య, అక్కడి నుండి భారతీయ పౌరులను తరలించడానికి ప్రభుత్వం భారత సైన్యం సహాయంతో ఆపరేషన్ కావేరి (Operation Kaveri) రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం (ఏప్రిల్ 24) యుద్ధంలో చిక్కుకున్న భారతీయ పౌరులను తరలించడానికి ప్రభుత్వం ఆపరేషన్ కావేరీ ప్రారంభించినట్లు తెలియజేశారు. ఇప్పుడు దీని కింద విమానం 360 మంది ప్రయాణికులతో ఢిల్లీకి చేరుకుంది.
బుధవారం (ఏప్రిల్ 26) జెడ్డా నుండి 360 మంది భారతీయులతో బయలుదేరిన విమానం రాత్రి 9 గంటలకు ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయానికి చేరుకుంది. అంతకుముందు జెడ్డా నుండి విమానం బయలుదేరినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ తెలియజేశారు. అదే సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా వారిని తిరిగి రావడాన్ని భారతదేశం స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆపరేషన్ కావేరీ కింద 360 మంది భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చారు. తొలి విమానం న్యూఢిల్లీ చేరుకుంది.
India welcomes back its own. #OperationKaveri brings 360 Indian Nationals to the homeland as first flight reaches New Delhi. pic.twitter.com/v9pBLmBQ8X
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 26, 2023
Also Read: Woman In Hijab Harassed: హిజాబ్ ధరించిన మహిళను వేధింపులకు గురి చేసిన వ్యక్తులు.. చివరికి?
సుడాన్ నుంచి సౌదీ అరేబియా మీదుగా భారత్కు వచ్చే ప్రయాణికుల వివరాలను రాష్ట్రాల వారీగా తెలియజేశారు. ఇందులో అసోంలో 3, బీహార్ 98, ఛత్తీస్గఢ్ 1, ఢిల్లీ 3, హర్యానా 24, హిమాచల్ ప్రదేశ్ 22, జార్ఖండ్ 6, మధ్యప్రదేశ్ 4, ఒడిశా 15, పంజాబ్ 22, రాజస్థాన్ 36, ఉత్తరప్రదేశ్ 116, ఉత్తరాఖండ్ నుంచి 10, పశ్చిమ బెంగాల్ నుంచి 2 ఉన్నారు. సూడాన్ నుండి తిరిగి వచ్చిన ఒక భారతీయ పౌరుడు, “భారత ప్రభుత్వం మాకు చాలా మద్దతు ఇచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైనది కాబట్టి మేము సురక్షితంగా ఇక్కడకు చేరుకోవడం గొప్ప విషయం. నేను PM మోదీ, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని పేర్కొన్నాడు.
మొత్తం సూడాన్లో దాదాపు 3,000 మంది భారతీయులు ఉన్నారు. సూడాన్ రాజధాని ఖార్టూమ్లోని అనేక ప్రదేశాల నుండి భారీ పోరాటాల నివేదికలతో సుడాన్లో భద్రతా పరిస్థితి అస్థిరంగా ఉంది. ఇక్కడ గత 10 రోజులుగా సైన్యం, పారామిలటరీ గ్రూపు మధ్య జరుగుతున్న భీకర పోరులో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (ఏప్రిల్ 21) ఉన్నత స్థాయి సమావేశంలో సూడాన్ నుండి భారతీయులను సురక్షితంగా తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశాంగ మంత్రులతో సూడాన్లోని పరిస్థితులపై చర్చించారు.
Related News
Bomb threat in Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. మోదీ, ముఖేష్ అంబానీలకు 400 కోట్ల డిమాండ్
ఢిల్లీ ఎన్సీఆర్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దేశ రాజధాని వ్యాప్తంగా మొత్తం 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.