16,397 Deaths: 2021లో సీటుబెల్ట్ ధరించక 16 వేల మంది మృతి
ప్రయాణంలో సీటు బెల్టు (seat belt) పెట్టుకోని వాహనాలు నడపడం మీరు చాలా సార్లు చూసి ఉంటారు. కానీ అలాంటి వారు ప్రమాదంలో ప్రాణాపాయానికి గురవుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం సీటు బెల్టు (seat belt) పెట్టుకోని కారు డ్రైవర్లు ప్రమాదాలకు గురై 16 వేల మందికి పైగా మరణించారు.
- By Gopichand Published Date - 07:11 AM, Fri - 30 December 22
ప్రయాణంలో సీటు బెల్టు (seat belt) పెట్టుకోని వాహనాలు నడపడం మీరు చాలా సార్లు చూసి ఉంటారు. కానీ అలాంటి వారు ప్రమాదంలో ప్రాణాపాయానికి గురవుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం సీటు బెల్టు (seat belt) పెట్టుకోని కారు డ్రైవర్లు ప్రమాదాలకు గురై 16 వేల మందికి పైగా మరణించారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2021 సంవత్సరంలో జరిగిన అన్ని రోడ్డు ప్రమాదాలలో సీటు బెల్ట్ ధరించని వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే సీటు బెల్టు పెట్టుకోకుండా కార్లలో ప్రయాణించిన వారిలో 16397 మంది చనిపోయారు. వీరిలో 8438 మంది డ్రైవర్లు కాగా, 7959 మంది ప్రయాణికులు ఉన్నారు.
సీటు బెల్టు లేకుండా ప్రయాణిస్తున్న వారిలో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ కూడా ఉన్నారు. సెప్టెంబర్ 4, 2022న జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తులో సైరస్ మిస్త్రీ కారు వెనుక కూర్చున్న తర్వాత కూడా సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే మరణించినట్లు తేలింది. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ అధికారి కెకె కపిల కూడా సీటు బెల్టులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు వెనుక సీటులో బెల్టులు ధరించడం ప్రారంభించే వరకు ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఇది చేయకపోతే ఆరు ఎయిర్బ్యాగ్ల సదుపాయం రివర్స్ అవుతుంది. ఇది మరింత ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది. క్రాష్లో సీట్ బెల్ట్లు ప్రాథమిక నియంత్రణ పరికరం అయితే ఎయిర్బ్యాగ్లు అనుబంధ మద్దతును అందిస్తాయి. సీటు బెల్టులు లేకుండా ఎయిర్బ్యాగ్ అమర్చినట్లయితే అది తీవ్రమైన గాయాలు, మరణానికి కూడా కారణమవుతుందని అనేక ప్రపంచ అధ్యయనాలు చూపిస్తున్నాయి.
Also Read: PM Modi mother passes away: ప్రధాని మోదీకి మాతృవియోగం
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొత్త నివేదిక ప్రకారం.. 2021 సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది గాయపడ్డారు. దేశంలో 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల 16,397 మంది చనిపోయారు. వీరిలో 8,438 మంది సంబంధిత వాహనాల డ్రైవర్లు కాగా, 7,959 మంది ప్రయాణికులున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల 46,593 మంది మృతి చెందారు. వీరిలో 32,877 మంది వాహనచోదకులు, 13,716 మంది ప్రయాణికులు ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ నివేదికలో పేర్కొంది.
Related News
Treatment Of Accident Victims: కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..!
రోడ్డు ప్రమాదాల బాధితుల (Treatment Of Accident Victims)కు ఇకపై చికిత్సలో నగదు సమస్య ఉండదు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పైలట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.