HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Modis Visit To Japan A New Direction For Bilateral Relations

PM Modi : జపాన్‌లో మోడీ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ

ఈ సందర్బంగా ఆయన 15వ భారత-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తన జపాన్ ప్రత్యుతంగా ఉన్న ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలు జరగనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ సహకారం వంటి అనేక అంశాలపై ఇరు దేశాధినేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

  • Author : Latha Suma Date : 29-08-2025 - 10:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi's visit to Japan: A new direction for bilateral relations
Modi's visit to Japan: A new direction for bilateral relations

PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శుక్రవారం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. ఆగస్టు 30, శుక్రవారం ప్రారంభమైన ఈ పర్యటన, ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలకంగా భావించబడుతోంది. ఈ సందర్బంగా ఆయన 15వ భారత-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తన జపాన్ ప్రత్యుతంగా ఉన్న ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలు జరగనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ సహకారం వంటి అనేక అంశాలపై ఇరు దేశాధినేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

Read Also: Vizag : నేడు విశాఖలో ముగ్గురు ‘బాబు’ లు పర్యటన

ప్రపంచ వాణిజ్య విధానాల్లో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన కఠినమైన వాణిజ్య విధానాలు భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపిన వేళ, జపాన్ వంటి కీలక భాగస్వామి దేశాలతో బంధాలను మెరుగుపరచడమే మోడీ ఉద్దేశ్యం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టోక్యోలో జరగనున్న తొలి దశ చర్చల్లో, జపాన్ భారత్‌లో పెట్టుబడులను రెట్టింపు చేయాలన్న దిశగా హామీ ఇవ్వనున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సిటీస్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో జపాన్ మద్దతు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశముంది. ఇది వరకే జపాన్-భారత్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, మౌలిక వృద్ధి, డిజిటల్ రంగాల్లో సహకారం కొనసాగుతుండగా, ఇప్పుడు ఆ బంధాన్ని మరింత బలంగా మలచే ప్రయత్నం జరుగుతోంది.

ఈ పర్యటనలో భాగంగా మోడీ, జపాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. దీనివల్ల ఇండియా జపాన్ మధ్య వ్యాపార పరమైన నూతన అవకాశాలను చర్చించే వీలుంటుంది. శనివారం పర్యటన రెండోరోజు, మోడీ మరియు ఇషిబా కలిసి హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్‌లో సెందాయ్ నగరానికి ప్రయాణించనున్నారు. అక్కడ వారు ఒక ఆధునిక సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్శన, భారత్‌లో సెమీకండక్టర్ తయారీకి జపాన్ సహకారం పొందేందుకు దారితీయవచ్చని అధికారులు చెబుతున్నారు. పర్యటన ముగిశాక, ప్రధాని మోడీ చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్ నగరంలో జరుగనుంది. అక్కడ కూడా ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక చర్చలు జరగనున్నాయి. మొత్తంగా చూస్తే, మోడీ జపాన్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. వ్యూహాత్మకంగా, ఆర్థికంగా, సాంకేతికంగా ఇరు దేశాలు కలిసి ముందడుగు వేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది.

Read Also: Bigboss : ఛాన్స్‌ల కోసం పడుకున్నా తప్పులేదంటున్న బిగ్ బాస్ బ్యూటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • High speed bullet train
  • India investments Trade agreements
  • India Japan relations
  • India Japan summit
  • pm modi
  • SCO Summit
  • semiconductor manufacturing
  • Shigeru Ishiba
  • Tokyo visit

Related News

President Trump

President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

టీవల US-India Critical and Emerging Technology Initiative (iCET) కింద ఇరు దేశాలు క్రిటికల్ మినరల్స్‌పై ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అయినప్పటికీ ట్రంప్ భారత్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు.

    Latest News

    • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

    • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

    Trending News

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

      • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

      • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd