Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులోరాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
- By Latha Suma Published Date - 02:59 PM, Fri - 23 February 24
Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదు అయిన నేరాభియోగ పరువునష్టం కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. కేంద్ర మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah)ఓ హత్య కేసులో నిందితుడని గతంలో రాహుల్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఆ ఘటనలో రాహుల్పై క్రమినల్ డిఫమేషన్ కేసు బుక్ చేశారు. ట్రయల్ కోర్టులో ఆ కేసు విచారణ జరుగుతున్నది.
We’re now on WhatsApp. Click to Join.
జస్టిస్ అంబుజనాథ్ ఈకేసును విచారించారు. రాహుల్ గాంధీ తరపున అడ్వకేట్ పీయూష్ చిత్రేశ్, దీపాంకర్ రాయ్లు వాదించారు. ఫిబ్రవరి 16వ తేదీన రాహుల్ గాంధీ రాసిన లేఖను కోర్టులో సమర్పించారు. అయితే జస్టిస్ అంబుజనాథ్కు చెందిన బెంచ్ తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
జార్ఖండ్ హైకోర్టులో బీజేపీ నేత నవీజ్ ఝా ఆ కేసును ఫైల్ చేశారు. బీజేపీ నేత అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆ పిటీషన్లో ఆరోపించారు. తొలుత లోయర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆ మ్యాటర్ను జార్ఖండ్ హైకోర్టుకు తరలించారు.
Related News
PM Modi slams Sam Pitroda: దుమారం రేపుతున్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన మోడీ
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా తన అభ్యంతరకర వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. వారసత్వ పన్నుకు సంబంధించి మాట్లాడిన శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ శామ్ పిట్రోడా వ్యాఖ్యలను తప్పు పడుతూ మండిపడ్డారు.