Gujarat Assembly Elections: ఉగ్రవాదులను ప్రోత్సహించింది కాంగ్రెస్సే…ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..!!
- By hashtagu Published Date - 08:06 AM, Mon - 28 November 22
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. తొలిదశకు ఇంకా కొన్నిరోజుల సమయమే మిగిలింది. ఈ తరుణంలో ప్రధానపార్టీలన్నీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అగ్రనేతలంతా గుజరాత్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. 7వ సారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సూరత్ లో పర్యటించారు. నేత్రాంగ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
The new generation of Gujarat has not seen the serial bomb blasts of Ahmedabad & Surat. I want to caution them of those who are well-wishers of terrorists. Batla house encounter was an act of terrorism but Congress leaders had questioned it: PM Modi in Surat, Gujarat pic.twitter.com/kD2z7pEPaz
— ANI (@ANI) November 27, 2022
ఉగ్రవాదులను ప్రోత్సహించేది కాంగ్రెస్సే అంటూ ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఉగ్రవాదం పేట్రేగిపోయిందన్నారు. చాలా కాలంగా ఉగ్రవాదుల లక్ష్యంలో గుజరాత్ ఉందన్న మోదీ…ఇప్పుడు ఉగ్రవాదం అంతం కావాలని కోరుకుంటుదన్నారు. గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాద జాడలు లేకుండా అంతం చేశామన్నారు. టెర్రరిస్టుల విషయంలో బీజేపీ ఎప్పుడూ కఠిన చర్యలు తీసుకుందన్నారు. అయితే కేంద్రంలోని కాంగ్రెస్ ఉగ్రవాదులను విడదుల చేసేందుకు కృషి చేసిందని దానిని ఎవరూ మర్చిపోలేరని ఘాటుగా విమర్శించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కాంగ్రెస్ ను కోరితే…కాంగ్రెస్ బీజేపీ -మోదీని టార్గెట్ చేసిందన్నారు. దీనిఫలితంగానే భారత్ లో పెద్ద పెద్ద నగరాల్లో టెర్రరిస్టుల నెట్ వర్క్ విస్తరించిందని మండిపడ్డారు.
Related News
KTR Tweet Viral: కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్!
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ ట్వీట్లో కాంగ్రెస్ ఇచ్చిన పలు హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.