Heavy Rains : మరో మూడు రోజులు.. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా లేకపోతే భారీ నష్టం తప్పదు..
తాజాగా మరో మూడు రోజులపాటు దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) ఉంటాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) హెచ్చరించింది.
- Author : News Desk
Date : 26-07-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
గత కొన్ని రోజులుగా వర్షాలు (Rains) దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మొన్నటిదాకా నార్త్ లో, ఢిల్లీ (Delhi) లో భారీ వర్షాలు రాగా అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఢిల్లీ, గుజరాత్, ఉత్తరాఖండ్ లలో భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సౌత్ (South) లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో (Telugu States) వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు చాలా నష్టపోయారు.
తాజాగా మరో మూడు రోజులపాటు దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) ఉంటాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) హెచ్చరించింది. భారీగా నష్టం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒడిశా, మహారాష్ట్రలోని పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు, ఢిల్లీ-NCRకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ భారీ వర్షాలతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే భారీ నష్టం తప్పదని వెల్లడించింది వాతావరణ శాఖ.
Also Read : USA: జోరుగా వడగళ్ల వాన.. దెబ్బకు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్?