HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Has No Intention Of Escalating Tensions We Will Respond Strongly If Pakistan Tries Ajit Doval

Operation Sindoor : ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం భారత్‌కు లేదు.. పాక్‌ ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తాం: అజిత్ దోవల్

పాకిస్థాన్‌ పరిస్థితులను మరింత ఉద్రిక్తత తాలూకుగా మలచే ప్రయత్నం చేస్తే, భారత్‌ నుంచి మరింత గట్టి ప్రతిస్పందన ఉండబోతుందని స్పష్టం చేశారు. అయితే భారత్‌ ఉద్దేశం శాంతి స్థాపనకే అని, ఉద్రిక్తతల పట్ల దేశానికి ఆసక్తి లేదని ఆయన వివరించారు.

  • By Latha Suma Published Date - 05:38 PM, Wed - 7 May 25
  • daily-hunt
India has no intention of escalating tensions.. We will respond strongly if Pakistan tries: Ajit Doval
India has no intention of escalating tensions.. We will respond strongly if Pakistan tries: Ajit Doval

Operation Sindoor : పాకిస్థాన్‌ ప్రేరిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌ తీవ్ర చర్యలు చేపట్టింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై లక్ష్యసాధిత దాడులు జరిపింది. ఈ చర్యల నేపథ్యంలో, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్ ఇతర దేశాలతో చురుకైన సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టే క్రమంలో దోవల్ ఇప్పటికే ఎనిమిది దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

Read Also: Operation Sindoor : 25 నిమిషాల్లోనే పాక్ ను ఉ** పోయించారు..మరి 24 గంటలు టైం ఇస్తే..!!

ఈ సందర్భంగా ఆయన చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడారు. పాకిస్థాన్‌ పరిస్థితులను మరింత ఉద్రిక్తత తాలూకుగా మలచే ప్రయత్నం చేస్తే, భారత్‌ నుంచి మరింత గట్టి ప్రతిస్పందన ఉండబోతుందని స్పష్టం చేశారు. అయితే భారత్‌ ఉద్దేశం శాంతి స్థాపనకే అని, ఉద్రిక్తతల పట్ల దేశానికి ఆసక్తి లేదని ఆయన వివరించారు. అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, రష్యా, ఫ్రాన్స్‌, సౌదీ అరేబియా తదితర దేశాలకు ‘ఆపరేషన్‌ సిందూర్’ వెనుక ఉన్న కారణాలను వివరించారు. పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదుల శిబిరాలపై తక్షణమే స్పందించడం తప్పనిసరైన చర్యగా పేర్కొన్నారు.

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా భారత సైన్యం పాక్‌లోని నాలుగు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఐదు ఉగ్ర స్థావరాలపై క్షిపణుల దాడులు జరిపింది. అంతర్జాతీయ సరిహద్దుకు 30 కి.మీ. దూరంలో ఉన్న గుల్పూర్‌ (లష్కరే తోయిబా) శిబిరం కూడా ఈ దాడుల్లో ప్రధాన లక్ష్యంగా మారింది. రాజౌరి , ఫూంచ్‌ ప్రాంతాల్లో యాక్టివ్‌గా ఉన్న ఉగ్రవాదులే గతంలో పూంచ్‌ దాడులకు పాల్పడినట్టు భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, దాదాపు 80 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. బవహల్పూర్‌లోని జైషే మహ్మద్‌ క్యాంప్‌, మురిద్కేలోని లష్కరే తోయిబా శిబిరాల్లో అత్యధిక నష్టాలు జరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఉగ్రవాదంపై పోరాటంలో భారత మిత్ర దేశాలతో సమన్వయం కొనసాగుతుందని అజిత్ దోవల్ పేర్కొన్నారు.

Read Also: Peddireddy Ramachandra Reddy: వైసీపీకి హ్యాండిచ్చిన పెద్దిరెడ్డి! అప్పుడు ఆలా? ఇప్పుడు ఇలా?

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chinese Foreign Minister
  • india
  • India National Security Advisor Ajit Doval
  • Operation Sindoor
  • pakistan

Related News

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో మహిళల భద్రతపై ఆందోళన.. నాలుగేళ్లలో 7,500 కంటే ఎక్కువ హత్యలు!

డాన్ నివేదిక ప్రకారం.. గత నాలుగు సంవత్సరాలలో పాకిస్తాన్‌లో మహిళలపై హింసకు సంబంధించిన మొత్తం 1,73,367 వివిధ కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాల ప్రకారం.. మహిళలపై నేరాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుదలను చూపించింది.

  • Pak Hackers

    Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

  • Vande Mataram

    Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

Latest News

  • Isro Moon Maps: చంద్రయాన్-2 పెద్ద విజయం.. చంద్రుని ధ్రువ ప్రాంతాల హై-క్వాలిటీ డేటా విడుదల చేసిన ఇస్రో!

  • Y+ Security: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి వై+ భద్రత.. ఏంటి ఈ భద్రతా వ్యవస్థ?

  • IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!

  • Electric Two-Wheeler: రూ. 65వేల‌కే ఎలక్ట్రిక్ టూ-వీలర్.. కేవలం 1000 మందికి మాత్ర‌మే ఛాన్స్‌!

  • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

Trending News

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd