HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Good News For Farmers Pm Kisan Scheme Funds To Be Released Tomorrow

PM Kisan : రైతులకు శుభవార్త.. రేపు పీఎం కిసాన్‌ పథకం నిధులు విడుదల

ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమం వారాణసిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మోడీ వర్చువల్ విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు బదిలీ చేయనున్నారు.

  • By Latha Suma Published Date - 10:46 AM, Fri - 1 August 25
  • daily-hunt
Good news for farmers.. PM Kisan scheme funds to be released tomorrow
Good news for farmers.. PM Kisan scheme funds to be released tomorrow

PM Kisan : ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకం కింద రైతులకు మరొకసారి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం, ఆగస్టు 2న కేంద్ర ప్రభుత్వం రూ.20,500 కోట్లు విడుదల చేయనుంది. ఇది పథకానికి సంబంధించిన 20వ విడతగా నమోదవుతోంది. ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమం వారాణసిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మోడీ వర్చువల్ విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు బదిలీ చేయనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బుధవారం ఈ కార్యక్రమ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఏటా రూ.6,000 – మూడు విడతలుగా

పీఎం కిసాన్‌ యోజన 2019లో ప్రారంభమై, అప్పటి నుంచి రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. ప్రతి సంవత్సరం రూ.6,000 మొత్తాన్ని మూడు విడతలుగా (ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున) విడుదల చేస్తారు. ఇప్పటివరకు 19 విడతలు విడుదల కాగా, ప్రస్తుతం 20వ విడతకు సంబంధించిన నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటివరకు ఈ పథకం కింద రైతులకు దాదాపు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధులు అందించబడినట్లు అధికారిక సమాచారం. ఈ విడతలో కూడా సుమారు 9.3 కోట్ల మంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అర్హతకు కచ్చితమైన ప్రమాణాలు

ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలంటే రైతులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా e-KYC పూర్తిచేయడం, భూమి రికార్డుల ధృవీకరణ, మరియు ఆధార్‌ కార్డు బ్యాంకు ఖాతాకు అనుసంధానం వంటి అంశాలు తప్పనిసరి. ఈ ప్రక్రియలు పూర్తిచేయని రైతుల ఖాతాల్లోకి వాయిదా జమ కాకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే పలు రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇంకా వివరాలను అప్‌డేట్ చేయనివారు వీలైనంత త్వరగా పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా స్థానిక CSC కేంద్రాల ద్వారా వివరాలను సరిచేసుకోవాలని సూచన.

వర్చువల్‌గా లక్షల మంది రైతులు పాల్గొననున్న కార్యక్రమం

వారణసిలో జరిగే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు వర్చువల్‌ విధానంలో హాజరవుతారు. ప్రధానమంత్రి ప్రసంగంతో పాటు, నిధులు జమ అవుతున్న ప్రక్రియను ప్రత్యక్షంగా చూడనున్నారు. నిధులు జమ అయిన వెంటనే రైతులకు SMS ద్వారా సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం ద్వారా రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా, వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడమనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పీఎం కిసాన్‌ యోజనకు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించిందని అధికారులు వెల్లడించారు.

Read Also: Anil Ambani : రూ.17వేల కోట్ల బ్యాంక్ రుణ మోసాలపై అనిల్ అంబానీకి ఈడీ సమన్లు

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 20th tranche of funds released
  • farmers
  • pm kisan
  • Pm Kisan Scheme
  • pm modi
  • varanasi

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • Fertilizer Farmers

    GST 2.0 : రైతులకు కేంద్రం శుభవార్త

  • Small chip made in India has the power to change the world: PM Modi

    PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ

Latest News

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd