National Herald Case : నేడు మళ్లీ ఈడీ ముందుకు సోనియా.. నిన్న ఆరుగంటలకుపైగా విచారణ
నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు మళ్లీ ఈడీ ముందు సోనియా గాంధీ హాజరుకానున్నారు
- By Prasad Published Date - 07:24 AM, Wed - 27 July 22
నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు మళ్లీ ఈడీ ముందు సోనియా గాంధీ హాజరుకానున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరు గంటలకు పైగా ప్రశ్నించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన తర్వాత సెంట్రల్ ఢిల్లీలోని ఏజెన్సీ కార్యాలయం నుండి మంగళవారం సాయంత్రం బయటకు వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి సోనియా గాంధీ మంగళవారం ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ నిరసనకు వెళ్లగా, ప్రియాంక గాంధీ తిరిగి ఏజెన్సీ కార్యాలయంలోనే ఉన్నారు.
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక దర్యాప్తులో ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్తో ఆమె ప్రమేయానికి సంబంధించిన దాదాపు 30 ప్రశ్నలకు సోనియా గాంధీని మంగళవారం సమాధానం కోరినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఢిల్లీలోని ED కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమై దాదాపు 2.5 గంటలపాటు ఆమె ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. 90 నిమిషాల భోజన విరామం తర్వాత సాయంత్రం 7 గంటల వరకు కొనసాగాయి. అదనపు డైరెక్టర్ మోనికా శర్మ నేతృత్వంలోని బృందం ఆమెను ప్రశ్నించింది. మంగళవారం ఆమె ప్రశ్నించిన సమయంలో వార్తాపత్రిక పనితీరు, నిర్వహణ, దాని వివిధ ఆఫీస్ బేరర్ల పాత్ర, నేషనల్ హెరాల్డ్ మరియు యంగ్ ఇండియన్ వ్యవహారాల్లో ఆమె మరియు రాహుల్ గాంధీ ప్రమేయం గురించి అడిగారు.
Related News
Renu Desai : హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు సపోర్ట్ చేస్తున్న రేణు దేశాయ్.. స్పెషల్ పోస్ట్ వైరల్..
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు సపోర్ట్ చేస్తున్న రేణు దేశాయ్..