HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Center Clarifies On Toll Fees For Two Wheelers

Toll Fee : టూవీలర్లకు టోల్ ఫీజుపై కేంద్రం స్పష్టత

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టూవీలర్ల నుంచి ఎటువంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మకండీ అని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న టోల్ వసూళ్ల నిబంధనలు నేషనల్ హైవేస్ ఫీజు (డెటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్), రూల్స్-2008 ప్రకారంగా కొనసాగుతున్నాయని, వీటిలో ఎలాంటి మార్పు ప్రతిపాదన ప్రస్తుతం లేదని పేర్కొంది.

  • Author : Latha Suma Date : 21-08-2025 - 3:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Center clarifies on toll fees for two-wheelers
Center clarifies on toll fees for two-wheelers

Toll Fee : జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ద్విచక్ర వాహనాలపై టోల్ ఫీజు వసూలు చేస్తున్నామని సోషల్ మీడియాలో వదంతులు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టతనిచ్చింది. ద్విచక్ర వాహనాలపై ఎలాంటి టోల్ వసూలు చేయడం లేదని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.  దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టూవీలర్ల నుంచి ఎటువంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మకండీ అని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న టోల్ వసూళ్ల నిబంధనలు నేషనల్ హైవేస్ ఫీజు (డెటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్), రూల్స్-2008 ప్రకారంగా కొనసాగుతున్నాయని, వీటిలో ఎలాంటి మార్పు ప్రతిపాదన ప్రస్తుతం లేదని పేర్కొంది. ఇందులో ప్రకారం, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు వర్తిస్తుంది.

టోల్ వర్తించే వాహనాల జాబితా

ప్రస్తుతం టోల్ వసూలు జరుగుతున్న వాహనాల్లో కారు, జీప్, వ్యాన్, తేలికపాటి వాణిజ్య వాహనాలు, బస్సులు, ట్రక్కులు, మల్టీ యాక్సిల్ వాహనాలు, భారీ నిర్మాణ యంత్రాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాలు (టూవీలర్లు) ఈ జాబితాలో లేవని మరోసారి పునరుద్ఘాటించింది.

ఫాస్టాగ్ పాసుల విక్రయాల్లో రికార్డు స్థాయి ఆదాయం

మరోవైపు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజా గణాంకాలను విడుదల చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే 5 లక్షలకు పైగా వార్షిక టోల్ పాసులు అమ్ముడైనట్లు తెలిపింది. ఈ ఫాస్టాగ్ ఆధారిత పాసుల విక్రయాల ద్వారా రూ. 150 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. ఈ వార్షిక టోల్ పాసు ప్రైవేట్ వాహనదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఒక్కో పాసు ధరను రూ. 3,000గా నిర్ణయించారు. ఇది కొనుగోలు చేసిన తేదీ నుంచి సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్రయాణాల వరకు చెల్లుబాటు అవుతుంది — ఏది ముందైతే అదే అమలులోకి వస్తుంది.

పాసుల అమ్మకాల్లో తమిళనాడు మొదటి స్థానంలో

ఫాస్టాగ్ వార్షిక పాసుల విక్రయాల్లో అత్యధిక స్పందన లభించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తర్వాత కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ పాసుల ఆధారంగా టోల్ లావాదేవీల పరంగా చూస్తే తమిళనాడు, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం, ద్విచక్ర వాహనాలపై టోల్ ఫీజు వసూలు చేసే ప్రసక్తే లేదని తేలిపోయింది. ఎన్‌హెచ్‌ఏఐ తరఫున కూడా అలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తూ, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారం నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Read Also: Anemia : అనీమియా అంటే ఏంటీ..?అనీమియాపై ఉన్న అపోహలు.. వాస్తవాలు..ఏమిటో తెలుసుకుందాం..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • fastag
  • karnataka
  • National Highways Authority of India
  • NHAI
  • tamil nadu
  • Toll Fee
  • Toll Fee for Two Wheelers
  • toll tax
  • Two Wheelers

Related News

CM Chandrababu Naidu

CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి (ఈ నెల 11న) ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షిం

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • Congress Party

    Tamil Nadu Protest: తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd