HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Ceasefire Inside Story India Prepares To Attack Pakistans Nuclear Facilities Pakistan Cowers In Fear

Ceasefire Inside Story: పాక్ అణు స్థావరాలపై దాడికి సిద్ధమైన భారత్.. అందుకే సీజ్‌ఫైర్‌కు అంగీకారం

మే 7న(బుధవారం) వేకువజామున భారత సేనలు  ‘ఆపరేషన్ సిందూర్’(Ceasefire Inside Story) నిర్వహించాయి. 

  • By Pasha Published Date - 01:03 PM, Sun - 11 May 25
  • daily-hunt
Ceasefire Inside Story Pakistans Nuclear Facilities India Attack

Ceasefire Inside Story: ‘సీజ్ ఫైర్.. మహాప్రభో..’ అంటూ భారత్‌తో కాళ్ల బేరానికి పాకిస్తాన్ ఎందుకొచ్చింది ? అంతలా పాకిస్తాన్ భయపడానికి కారణమేంటి ?  మే 10వ తేదీన(శనివారం రోజు) మధ్యాహ్నం అకస్మాత్తుగా పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌కు చెమటలు ఎందుకు పట్టాయి ?  సీజ్ ఫైర్‌ ప్రతిపాదనతో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) రాజీవ్ ఘయ్‌కు పాకిస్తాన్ డీజీఎంఓ కాశిఫ్ అబ్దుల్లా ఎందుకు కాల్ చేశారు ? ఇందుకు దారితీసిన అంతర్గత పరిణామాలపై ఇన్‌సైడ్ స్టోరీ..

Also Read :Who is DGMO: నేరుగా పాక్‌తో భారత డీజీఎంఓ చర్చలు.. డీజీఎంఓ పవర్స్, బాధ్యతలేంటి ?

మే 7 నుంచి 10 వరకు ఫైట్.. అంతలోనే అనూహ్యంగా.. 

మే 7న(బుధవారం) వేకువజామున భారత సేనలు  ‘ఆపరేషన్ సిందూర్’(Ceasefire Inside Story) నిర్వహించాయి.  పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. తీవ్ర సైనిక ఘర్షణ జరిగింది. మే 10వ తేదీన (శనివారం) మధ్యాహ్నం వరకు కూడా ఇరుదేశాలు హోరాహోరీగా తలపడ్డాయి. పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలు, సైనిక స్థావరాలు, ఎయిర్ లాంచ్ ప్యాడ్‌లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ కూడా భారత్‌లోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకొని దాడులు చేసింది. భారత ఎయిర్‌పోర్టులు, వైమానిక స్థావరాలు, మిలిటరీ బేస్‌లను పాకిస్తాన్ లక్ష్యంగా ఎంచుకుంది. ఈ పోరు అకస్మాత్తుగా మే 10న (శనివారం) మధ్యాహ్నం 12 గంటల తర్వాత అనూహ్య మలుపు తీసుకుంది.

Also Read :Kashmir Offer : భారత్, పాక్‌లకు ట్రంప్ ‘‘కశ్మీర్ ఆఫర్’’.. ఏమిటది ?

వణికిపోయిన పాక్ ప్రధానమంత్రి

శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారత్‌లోని వివిధ సరిహద్దు ప్రాంతాలపై దాడికి పాకిస్తాన్ యత్నించింది. దీంతో రగిలిపోయిన భారత్.. పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై సూసైడ్ డ్రోన్లతో ఎటాక్స్ చేసింది. అయినా పాకిస్తాన్ దాడులను కంటిన్యూ చేయడంతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెంటనే కీలక సమావేశం నిర్వహించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, సీడీఎస్‌లతో మోడీ భేటీ అయ్యారు. పాకిస్తాన్‌లోని అణు స్థావరాల మ్యాప్‌పై ఈ కీలక సమావేశంలో చర్చించారని తెలిసింది. దీనిపై పాకిస్తాన్‌ ప్రభుత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ చేరింది. దీంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ హడలిపోయారు. వెంటనే పాకిస్తాన్ అణుబాంబుల విభాగం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వాటి భద్రత కోసం చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఒకవేళ తమ అణు స్థావరాలు, వాటితో ముడిపడిన మౌలిక సదుపాయాలపై భారత్ దాడి చేస్తే ఉపద్రవం సంభవిస్తుందని పాక్ ప్రధాని షాబాజ్ భయపడ్డారు.

ఐరాస, అమెరికాను సంప్రదించిన పాక్

దీనిపై  ఐక్యరాజ్యసమితిని, అమెరికాను పాకిస్తాన్ సంప్రదించింది. ‘‘ఇకనైనా ఆలస్యం చేయొద్దు.. మీరు భారత్‌తో హాట్ లైన్‌ను వాడుకోండి. సీజ్ ఫైర్‌ గురించి భారత్‌కు ప్రతిపాదించండి. లేదంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు’’ అని పాకిస్తాన్‌ ఎదుట అమెరికా ప్రతిపాదించింది. అమెరికా సూచనలు పాకిస్తాన్ ప్రభుత్వం బుర్రకు ఎక్కాయి. దీంతో మే 10న(శనివారం) మధ్యాహ్నం 3:35 గంటలకు, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్‌కు హాట్‌లైన్‌లో కాల్ చేశారు. ఆ వెంటనే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.  ఈవివరాలను  భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు.

భారత్ కీలక షరతులు 

ఇతర దేశాల మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్‌తో చర్చలు జరిపేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ.. తదుపరి అడుగు పెద్దదిగా ఉంటుందని భారత్ పేర్కొంది. భవిష్యత్తులో అవసరమైతే  పాకిస్తాన్ ఇంధన, ఆర్థిక, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై దాడులు కూడా ఉంటాయని తేల్చి చెప్పింది. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ సింధూ నదీ జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనే నిర్ణయం అమలులో ఉంటుందని భారతదేశం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఒక్క ఉగ్రవాద దాడి జరిగినా, దానిని ‘యుద్ధ చర్య’గా పరిగణిస్తామని పేర్కొంది. ఉగ్రదాడులకు  శిక్ష ఈసారి కంటే చాలా ప్రాణాంతకంగా ఉంటుందని భారత్  తెలిపింది. తదుపరి దశ సైనిక, దౌత్య మార్గదర్శకాలను నిర్ణయించడానికి భారతదేశం, పాకిస్తాన్  డీజీఎంఓలు మే 12న మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్‌కాల్‌లో చర్చించుకుంటారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ceasefire Inside Story
  • india
  • India Attack
  • India vs Pakistan
  • pakistan
  • Pakistans Nuclear Facilities

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • Suryakumar

    SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Pakistan Bombs Its Own Peop

    Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి

Latest News

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd