Pak Drone: పాక్ కవ్వింపు చర్యలు.. భారత భూభాగంలోకి డ్రోన్..!
సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. డ్రోన్ల ద్వారా సరిహద్దు రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
- By Gopichand Published Date - 03:13 PM, Sat - 26 November 22
సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. డ్రోన్ల ద్వారా సరిహద్దు రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పాకిస్థాన్ చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. పంజాబ్లోని అమృత్సర్ సెక్టార్లో భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం రాత్రి పాక్ డ్రోన్ను బీఎస్ఎఫ్ కూల్చివేసింది. శుక్రవారం రాత్రి పంజాబ్ అమృత్ సర్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో ఒక డ్రోన్ ను భారత సైనికులు పసిగట్టారు. ఆ డ్రోన్ పాకిస్థాన్ నుండి మన భూభాగంలోకి వస్తున్నట్లు గుర్తించారు.
అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సైనికులు డ్రోన్ పై కాల్పులు జరిపారు. డ్రోన్ కు ఓ బుల్లెట్ తగలడంతో అమృత్ సర్ జిల్లాలోని దావోకే గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పడిపోయింది. పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో డ్రోన్ సైనికులకు చిక్కింది. చైనాలో తయారైన క్వాడ్ కాప్టర్ డిజె1 మాట్రిస్ 300 ఆర్టీకే డ్రోన్ గా సైనికులు గుర్తించారు. ఫార్వర్డ్ ఏరియాలో మోహరించిన 144 బెటాలియన్కు చెందిన BSF సిబ్బందికి శుక్రవారం రాత్రి పాకిస్థాన్ వైపు నుండి భారత భూభాగంలోకి అనుమానాస్పదంగా డ్రోన్ వచ్చిన శబ్దం వినిపించింది. డ్రోన్ను దించడానికి దళాలు అనేక రౌండ్లు కాల్పులు జరిపాయి. అనంతరం జవాన్లు డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. అమృత్సర్ రేంజ్ డిఐజితో సహా సీనియర్ బిఎస్ఎఫ్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ (క్వాడ్కాప్టర్)ని దావోకే గ్రామ సమీపంలోని ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళ సిబ్బంది కూల్చివేసింది. డ్రోన్ శబ్దం విన్న జవాన్లు వెంటనే కాల్పులు జరిపి ఆపేందుకు ప్రయత్నించారు. బుల్లెట్లు తగలడంతో డ్రోన్ నేలపై పడింది. గత కొన్ని రోజులుగా.. పాకిస్తాన్ పంపిన డ్రోన్లను కూల్చివేయడంలో బిఎస్ఎఫ్ నిరంతరం సక్సెస్ అవుతోంది.
Related News
Amritpal Singh : ఎన్నికల బరిలో ఖలిస్థాన్ వేర్పాటువాది.. జైలు నుంచే పోటీ !
Amritpal Singh : అమృత్ పాల్ సింగ్.. మన దేశంలోని పంజాబ్ కేంద్రంగా ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన కరుడుగట్టిన టెర్రరిస్ట్.