HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Man Goes With Golden Footware From Hyderabad To Ayodhya Ram Mandir Will Give To Yogi Adityanath

Ram Mandir: భాగ్యనగరం నుంచి అయోధ్యకు పాదుకలు ప్రయాణం.. వాటి ధర తెలిస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం అందరి చూపు కూడా అయోధ్

  • By Anshu Published Date - 07:00 PM, Thu - 11 January 24
  • daily-hunt
Mixcollage 11 Jan 2024 06 34 Pm 2234
Mixcollage 11 Jan 2024 06 34 Pm 2234

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం అందరి చూపు కూడా అయోధ్య రామ మందిరం పైనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈనెల 22వ తేదీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా వందల సంవత్సరాల నాటి కల నెరవేరుతున్నందుకు శ్రీరాముని భక్తులు అలాగే హిందువులు ఆ మంచి గడియల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక రాముడి పై ఉన్న భక్తితో భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు స్వామివారికి విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. కొందరు స్వామి వారికి తోచిన విధంగా డబ్బు సహాయం చేస్తుండగా మరి కొందరు వస్తువుల రూపంలో సహాయం చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కూడా అయోధ్య రామ మందిరం కు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా జనవరి 22 న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన 64 ఏళ్ల వ్యక్తి చల్లా శ్రీనివాస్ శాస్త్రి, దేవుడికి బంగారు పూత పూసిన జత చెప్పులను సమర్పించడానికి అయోధ్యకు కాలినడకలన వెళ్లేందుకు సంకల్పించారు. దాదాపు 7,200 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. ఆయన అయోధ్య-రామేశ్వరం మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో శ్రీరాముడు తన వనవాసం సమయంలో అనుసరించిన మార్గాన్ని ఎంచుకున్నారు.

అయితే శ్రీరాముడు అయోధ్య నుంచి రామేశ్వరం చేరుకుంటే, శాస్త్రి మాత్రం శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగాన్ని దర్శించి జులై 20న తన నడకను ప్రారంభించానని, రివర్స్‌ ఆర్డర్‌లో యాత్ర చేపట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. జనవరి 15న అయోధ్య చేరుకోవడమే తన లక్ష్యం అని తెలిపారు. జనవరి 16న ఈ చరణ్ పాదుక ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి అందజేస్తానని అన్నారు. జనవరి 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు అయోధ్యను సందర్శించడం చాలా ఉత్సాహంగా ఉందని అన్నారు. రాముడి చెప్పులకు ప్రత్యేక విలువ ఉందన్నారు. రామాయణం ప్రకారం, శ్రీరాముని సోదరుడు భరతుడు రాజ్యాన్ని పాలించేందుకు గౌరవ సూచకంగా సింహాసనంపై తన అన్న శ్రీరాముని చెప్పులను ఉంచి అయోధ్యను పాలించినట్లు పురాణ ఇతిహాసాన్ని వివరించారు.

 

#WATCH | Telangana: A 64-year-old man, Challa Srinivas Sastry from Hyderabad embarked on a 7,200-kilometre padayatra to Ayodhya carrying Khadaun ‘charan paduka’ with him ahead of the ‘Pran Pratishtha’ ceremony of the Ram Temple. (09.01) pic.twitter.com/J8hQg6hBcS

— ANI (@ANI) January 10, 2024

శ్రీరాముడికి ఇవ్వడానికి నేను ప్రస్తుతం పంచ ధాతు అంటే ఐదు లోహాలతో తయారు చేసిన బంగారు పూతతో కూడిన పాదుకలు అనగా పాదరక్షలు తీసుకువెళుతున్నాను అని చెప్పుకొచ్చారు. తమిళనాడు నుంచి రోజుకు 30 నుండి 50 కి.మీ ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. బంగారు పూత పూసిన చెప్పుల జత విలువ దాదాపు రూ. 65 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా అందులో కొంత భాగాన్ని భక్తులు విరాళంగా కూడా ఇచ్చారని తెలిపారు. అయోధ్య భాగ్యనగర్ సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శాస్త్రి భవిష్యత్తులో అయోధ్యలో శాశ్వతంగా స్థిరపడాలని కోరుకుంటున్నాట్లు తన అంతరంగాన్ని వివరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ayodhya
  • Ayodhya Ram Mandir
  • hyderabad
  • ram mandir
  • yogi adityanath

Related News

Telangana Global Summit Vis

Global Summit 2025 : రెండు రోజులకు సంబదించిన పూర్తి షెడ్యూల్ ఇదే !!

Global Summit 2025 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో జరగనుంది

  • Telangana Global Summit 202

    Telangana Rising Global Summit 2025: సమ్మిట్‌ లో ఏం చర్చించనున్నారంటే?

  • Telangana Global Summit

    Telangana Global Summit: తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌.. ఉచిత బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిన రేవంత్ స‌ర్కార్‌!

  • Guests Coming To The Telang

    Telangana Global Summit 2025 : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే అతిరథులు వీరే !!

  • Common People Also Invited

    Telangana Global Summit 2025 : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సామాన్యులకు సైతం ఆహ్వానం

Latest News

  • Mana Shankara Vara Prasad Garu : శశిరేఖ, ప్రసాద్ లవ్ సాంగ్ ప్రోమో అదిరిపోయిందిగా !!

  • IndiGo Flight Disruptions : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎటుచూసినా సూట్కేసుల కుప్పలే !!

  • Sri Venkateswara University Academic Consultants Recruitment : నిరుద్యోగుల పరిస్థితి ఏంటి.. ఏపీ హైకోర్టు సీరియస్?

  • Kidneys Care : ఆల్కహాల్ కాదు.. కిడ్నీలను డ్యామేజ్ చేసే మరో డేంజర్ డ్రింక్!

  • Grama Panchayat Elections : ఇంటింటికీ ఫ్రీ వైఫై సర్పంచ్ అభ్యర్థి హామీ

Trending News

    • Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండానే!

    • Financial Crisis: మీ అరచేతిలో భాగ్య రేఖ.. ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది?

    • 14 Reels : అప్పుల ఊబిలో అఖండ నిర్మాతలు.. మెడకు చుట్టుకున్న ఆ 90 కోట్లు!

    • Virat Kohli Records: వైజాగ్‌లో రేపే నిర్ణయాత్మక పోరు.. కోహ్లీని ఊరిస్తున్న 3 భారీ రికార్డులీవే!

    • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd