Shiva Temples: ఒకే సరళ రేఖ పై 7 శివాలయాలు ఎలా నిర్మించారంటే?
జ్యోతిర్లింగ (Jyotirlinga) క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఉత్తరా ఖండ్లోని కేదార్నాథ్, తమిళనాడు లోని రామేశ్వరం
- By Vamsi Chowdary Korata Published Date - 12:48 PM, Sun - 19 February 23
జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఉత్తరా ఖండ్లోని కేదార్నాథ్, తమిళనాడు లోని రామేశ్వరం అనే రెండు జ్యోతిర్లింగాలు వెరీ స్పెషల్. అవి రెండూ రేఖాంశ రేఖపై 79 డిగ్రీల వద్ద ఉన్నాయి. ఈ రెండు జ్యోతిర్లింగాల మధ్య 5 శివాలయాలు (Shiva Temples) కూడా ఉన్నాయి. ఈ 5 శివాలయాలు (Shiva Temples) పంచ భూతాలైన నీరు, గాలి, అగ్ని, ఆకాశం, భూమిలను సూచిస్తాయి.
మొత్తం ఏడు దేవాలయాలు ఒకే వరుసలో
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, తమిళనాడులోని అరుణాచలేశ్వర్, తిల్లై నటరాజ, జంబుకేశ్వర్, ఏకాంబేశ్వరనాథ్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి శివాలయం, చివరకు రామేశ్వరం ఆలయాన్ని సరళ రేఖలా ఒకే లైన్ లో ఉన్నాయి. శ్రీకాళహస్తి శివాలయం నీరు, ఏకాంబేశ్వరనాథ్ ఆలయం అగ్ని, అరుణాచలేశ్వర్ ఆలయం గాలి, జంబుకేశ్వరర్ ఆలయం భూమి , తిల్లై నటరాజ ఆలయం ఆకాశాన్ని సూచిస్తాయి. ఈ దేవాలయాలన్నీ 79 డిగ్రీల రేఖాంశం యొక్క భౌగోళిక సరళ రేఖలో నిర్మించబడ్డాయి. అందుకే ఈ పవిత్రమైన రేఖను ‘శివశక్తి అక్ష రేఖ’ అని కూడా అంటారు. ఇంకో విశేషం ఏమిటంటే..ఈ ఆలయాలన్నీ సుమారు 4,000 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. ప్రదేశాల అక్షాంశం, రేఖాంశాలను కొలవడానికి ఉపగ్రహ సాంకేతికత అందుబాటులో లేని టైంలోనే ఇంత పర్ఫెక్ట్ గా 79 డిగ్రీల రేఖాంశం యొక్క భౌగోళిక సరళ రేఖపై వీటిని కట్టారు. ఈ రేఖకు ఒక చివరిలో ఉత్తరాన కేదార్నాథ్, దక్షిణాన రామేశ్వరం జ్యోతిర్లింగం ఉన్నాయి. ఈ రేఖ ఉత్తరం నుంచి దక్షిణం వరకు కలుపుతుంది. అందుకే ఈ ఆలయాలు నిర్మించినప్పుడు అక్షాంశం మరియు రేఖాంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటారని నమ్ముతారు.
ఉజ్జయిని భారతదేశంలోని గ్రీన్విచ్
ఉజ్జయినిలో స్థాపించబడిన భారతదేశంలోని ప్రత్యేక మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ దేవాలయాలన్నింటి మధ్యలో ఉంది. పాశ్చాత్య దేశాల కంటే ముందే ఉజ్జయినిలో సమయ గణన భావన ఉంది. ఉజ్జయిని భారతదేశం యొక్క సెంట్రల్ మెరిడియన్గా పరిగణించబడింది. భూమి, ఆకాశం యొక్క సాపేక్షతలో ఉజ్జయిని మధ్యలో ఉన్నట్లు పరిగణించ బడుతుంది.
టోలెమీ కూడా గుర్తించిన నగరం ఉజ్జయిని
భౌగోళిక గణనల ఆధారంగా, ప్రాచీన పండితులు ఉజ్జయిని సున్నా రేఖాంశంలో ఉన్నట్లు భావించారు. అలాగే, కర్కాటక రేఖ కూడా దీని మీదుగా వెళుతుందని నమ్ముతారు. గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు క్లాడియస్ టోలెమీ కూడా భౌగోళిక దృక్కోణం నుంచి ఉజ్జయిని చాలా ప్రత్యేకమైనదని నమ్మాడు. గ్రీకు నాగరికతలో ఉజ్జయినిని “ఓజీన్” అని పిలిచేవారు. ఆ సమయంలో ఉజ్జయిని ప్రపంచంలోని ప్రసిద్ధ నగరాల్లో ఒకటి.
ఈ ఏడు ఆలయాలను వరుసగా ఎలా నిర్మించారో తెలుసుకుందాం.
1. కేదార్నాథ్ ధామ్
ఈ ఆలయం 79.0669 డిగ్రీల రేఖాంశంలో ఉంది. కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. దీనినే అర్ధ జ్యోతిర్లింగం అంటారు. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని చేర్చడం ద్వారా ఇది పూర్తయింది. ఈ ఆలయాన్ని మహాభారత కాలంలో పాండవులు నిర్మించారని, ఆపై ఆదిశంకరాచార్యులు దీనిని పునరుద్ధరించారని చెబుతారు.
2. శ్రీకాళహస్తి ఆలయం
ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఉంది. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళ హస్తీశ్వరాలయం పంచభూతాలలో నీటికి ప్రతినిధిగా పరిగణించ బడుతుంది. ఈ ఆలయం 79.6983 డిగ్రీల E రేఖాంశంలో ఉంది.
3. ఏకాంబరేశ్వర ఆలయం
ఈ ఆలయం 79.42’00’ E రేఖాంశంలో ఉంది. ఇక్కడ శివుడు భూమి మూలక రూపంలో పూజించబడతాడు. ఈ భారీ శివాలయం పల్లవ రాజులచే నిర్మించబడింది. ఆ తరువాత చోళ, విజయనగర రాజులచే మెరుగుపరచబడింది. ఈ ఆలయంలో నీటికి బదులుగా మల్లెపూల సువాసన గల నూనెను సమర్పిస్తారు.
4. అరుణాచలేశ్వరాలయం
ఈ ఆలయం 79.0677 E డిగ్రీల రేఖాంశంలో ఉంది. దీనిని తమిళ రాజ్యానికి చెందిన చోళ వంశ రాజులు నిర్మించారు.
5. జంబుకేశ్వర ఆలయం
ఈ ఆలయం సుమారు 1800 సంవత్సరాల నాటిది. దాని గర్భగుడిలో ఎప్పుడూ నీటి ధార ప్రవహిస్తుంది.
6. తిల్లై నటరాజ ఆలయం
ఈ ఆలయం 79.6935 E డిగ్రీల రేఖాంశంలో ఉంది. ఇది ఆకాశ మూలకం కోసం తయారు చేయబడింది. ఈ ఆలయం నటరాజ రూపంలో శివునికి అంకితం చేయబడింది. 108 నృత్య భంగిమలకు సంబంధించిన పురాతన దృష్టాంతం చిదంబరంలో మాత్రమే కనుగొనబడింది.
7. రామేశ్వరం జ్యోతిర్లింగం
రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని లంకను అధిరోహించే ముందు శ్రీరాముడు స్థాపించాడని నమ్ముతారు. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.
Also Read: Kotappa Konda: మహా శివరాత్రి, కోటప్ప కొండ విశిష్టత..!
Related News
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ వస్తువులను దానం చేస్తే మంచిదట..!
హనుమాన్ జన్మోత్సవం (Hanuman Jayanti 2024) చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని ఈ ఏడాది ఏప్రిల్ 23న జరుపుకోనున్నారు.