HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >200 Foreigners Embrace Sanatan Dharma At Prayagraj Maha Kumbh

Maha Kumbh: సనాతన ధర్మంలోకి 200 మంది ఫారినర్లు.. మహాకుంభ మేళాలో ఆధ్యాత్మిక శోభ

హిందూయిజం గురించి బాగా రీసెర్చ్ చేశాకే మహాకుంభ మేళా(Maha Kumbh)కు వచ్చి, సనాతన ధర్మాన్ని స్వీకరించామని ఆ ఫారినర్లు చెబుతున్నారు.

  • By Pasha Published Date - 01:18 PM, Thu - 6 February 25
  • daily-hunt
Foreigners Into Sanatan Dharma Maha Kumbh Prayagraj Uttar Pradesh 2025

Maha Kumbh: విదేశీయులూ సనాతన ధర్మంలోకి ప్రవేశిస్తున్నారు. విదేశీ కల్చర్ అనేది అడ్డదిడ్డంగా తయారైంది. ఎంతోమంది విదేశీయులు బిజీలైఫ్‌ ఉచ్చులో పడి, సంపాదన రేసులో మునిగిపోయి మానసిక సుఖానికి దూరం అవుతున్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం వివిధ వ్యసనాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈక్రమంలో ఎంతోమంది విదేశీయులు వివిధ మతాల గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి అధ్యయనం చేసిన ఎంతో ఫారినర్లు తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా సాక్షిగా సనాతన ధర్మంలోకి ప్రవేశించారు. వివరాలివీ..

Also Read :Avuku ITI : అక్కడ ఐటీఐ విద్యార్థులంతా జైలుకే.. ఎందుకు ?

జగద్గురు సాయి మా లక్ష్మీ దేవి ఎవరు ?

మారిషస్‌ దేశానికి చెందిన జగద్గురు సాయి మా లక్ష్మీ దేవి గత కొన్ని దశాబ్దాలుగా హిందూ మత ప్రచారం చేస్తున్నారు. మహాకుంభ మేళా వేళ  ప్రయాగ్ రాజ్‌లో ఉన్న కుంభ్ నగర్ సెక్టార్ 17లో ఉన్న శక్తిధామ్ ఆశ్రమంలో జగద్గురు సాయి మా లక్ష్మీ దేవి ఉన్నారు. ఈసారి కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 200 మందికిపైగా విదేశీయులు ఆమె సమక్షంలో సనాతన ధర్మాన్ని స్వీకరించారు.తాజాగా బుధవారం ఒక్కరోజే 61 మంది విదేశీయులు జగద్గురు సాయి మా లక్ష్మీ దేవి ద్వారా వేదమంత్రాలు చదివి సనాతన ధర్మంలోకి ప్రవేశించారు.  జగద్గురు సాయి మా లక్ష్మీ దేవికి జపాన్, అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ సహా 12కుపైగా దేశాల్లో శిష్యులు ఉన్నారు. వారంతా ఆమె బోధనలతో ప్రభావితమై సనాతన ధర్మంలోకి వచ్చిన వారే.

Also Read :Fire Accident : జగన్ ప్లాన్ లో భాగమే ఈ అగ్ని ప్రమాదమా..?

జగద్గురు సాయి మా లక్ష్మీ దేవి ద్వారా సనాతన ధర్మాన్ని స్వీకరించిన విదేశీయుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయితే, ఇంకొందరు డాక్టర్లు, మరికొందరు మార్కెటింగ్ నిపుణులు. వీరంతా ఉన్నత విద్యావంతులే. హిందూయిజం గురించి బాగా రీసెర్చ్ చేశాకే మహాకుంభ మేళా(Maha Kumbh)కు వచ్చి, సనాతన ధర్మాన్ని స్వీకరించామని ఆ ఫారినర్లు చెబుతున్నారు. సనాతన ధర్మం స్వీకరించిన వారిలో.. ఎముకల వ్యాధి నిపుణురాలు కేథరీన్ గిల్డెమిన్(బెల్జియం), అమ్మకాలు, మార్కెటింగ్ నిపుణుడు డేవిడ్ హారింగ్టన్(ఐర్లాండ్‌‌),  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఆలివర్ గియులిరీ(ఫ్రాన్స్‌‌), ఆర్కిటెక్ట్ మ్యాథ్యూ లారెన్స్(అమెరికా), వైద్యుడు ఆండ్రీ అనత్( కెనడా), ఇంధన రంగ నిపుణుడు జెన్నీ మిల్లర్ (అమెరికా), ఐటీ డెవలపర్ మాథ్యూ సావోయ్(కెనడా), ఆరోగ్య భద్రతా సలహాదారు క్రిస్టెల్ డి కాట్(బెల్జియం) తదితరులు ఉన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Foreigners
  • Maha Kumbh
  • prayagraj
  • Sanatan Dharma
  • Uttar pradesh

Related News

Murder

Tragedy: చెల్లిని ప్రేమించాడని యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి..

Tragedy: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరాలు తగ్గడం లేదు. రోజురోజుకు నేరాల తీవ్రత పెరుగుతూ, ఘోర ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోరమైన హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది.

  • Crime

    Shocking : మనవడినే బలి ఇచ్చిన తాతయ్య.. షాకింగ్ నిజాలు

Latest News

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd