HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mahesh And Pawan Kalyan Donate Heavily To Flood Victims

Floods in AP & TG : వరద బాధితులకు మహేష్ , పవన్ కళ్యాణ్ లు భారీ విరాళం

సూపర్ స్టార్ మహేష్ బాబు , పవర్ స్టార్ , జనసేన ధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు భారీ విరాళం ప్రకటించారు

  • Author : Sudheer Date : 03-09-2024 - 9:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Mahesh Donate
Pawan Mahesh Donate

తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు చిత్రసీమ కదిలివస్తుంది. తమకు తోచిన ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు, నిర్మాతలు , డైరెక్టర్లు సాయం ప్రకటించగా..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) , పవర్ స్టార్ , జనసేన ధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు భారీ విరాళం ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు (Floods in AP & Telangana) అపార నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండు ప్రభుత్వాలు , రాజకీయ పార్టీలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని ఇరు సీఎంలు కోరడం తో ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. గతంలో పలు విపత్తులు ఎదురైనప్పుడు తమ వంతు సాయం చేసిన చిత్రసీమ..ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల కోసం తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు.

తాజాగా వరద బాధితులకు పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు చెరొక రూ.50 లక్షల సాయం చేస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ అనన్య నాగళ్ల రెండు రాష్ట్రాలకు కలిపి రూ.5 లక్షల సాయం అందించారు. హీరో సందీప్ కిషన్ తన వంతుగా సహాయం చేశారు. బాధితులకు ఆయన టీమ్ ఆహారాన్ని అందించింది. అక్కడే ఉన్న ఐఏఎస్ అధికారి లక్ష్మీ షా వారిని అభినందించారు. కష్ట సమయంలో ఇలా ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు.

ఇప్పటి వరకు సహాయం ప్రకటించిన సెలబ్రిటీలు వీరే..

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vijayanthi Movies) ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ‘ఆయ్‌’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వచ్చే కలెక్షన్లలో 25 శాతం ఆదాయాన్ని జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు. మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ (Vishwak Sen) సైతం తెలుగు రాష్ట్రాల‌ వ‌ర‌ద‌ల‌పై స్పందిస్తూ త‌మ సానుభూతి తెలియ‌జేశారు. ‘భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వ‌ర‌ద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అంటూ త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున‌ విరాళం అందజేశారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, ఎస్‌. రాధాకృష్ణ‌, ఎస్ నాగ‌వంశీలు సంయుక్తంగా త‌మ హారిక‌, హ‌సిని క్రియేష‌న్స్‌, సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ త‌రుపున ఆంద్ర‌ప్రదేశ్ రాష్ట్రానికి రూ.25 ల‌క్ష‌లు, తెలంగాణ‌లకు రూ.25 ల‌క్ష‌ల చొప్పున మొత్తంగా రూ.50 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరొక రూ.50 లక్షలు ప్రకటించారు. జూ. ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిలు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు ప్రకటించారు. వీరి బాటలోనే మిగతా హీరోలు , నిర్మాతలు కూడా తమ వంతు సాయం అందజేసేందుకు ముందుకు వస్తున్నారు.

Read Also : Vijayawada Floods: వరద బాధితులకు విరాళాలు కోరిన సీఎం చంద్రబాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • floods
  • mahesh 1 cr donation
  • pawan donation
  • rains
  • telangana

Related News

Southwest Monsoon

Rains: నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే ఈ రుతుపవనాలు, ఈసారి కొన్ని రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. అయితే, రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం ప్రకటించింది. జూన్ 4 లేదా 5వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

Latest News

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

  • Indian Govt: విదేశీయులకు కొత్త రూల్స్.. కేంద్ర హోంశాఖ కీలక మార్పులు

  • Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

  • AP Sports Mega DSC: స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025: పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా 421 క్రీడాకారుల కోటా పోస్టుల భర్తీ

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd