Jathi Ratnalu director: జాతిరత్నాలు డైరెక్టర్కి అరుదైన వ్యాధి..!
జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.
- By Gopichand Published Date - 09:43 PM, Thu - 3 November 22
జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. కామెడీ సినిమాలు చేసే అతడు బయట చాలా సీరియస్గా కనిపిస్తుంటాడు. అందుకు అతడికున్న హైలీ సెన్సీటీవ్ పర్సన్ (హెచ్ఎస్పీ) అనే వ్యాధే కారణమని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. “నాకు గ్లూటెన్ పడదు. కాఫీ తాగితే 2 రోజులు నిద్ర పట్టదు. ఏదైనా జ్యూస్ తాగితే నా మైండ్ కామ్ అవుతుంది” అని తెలిపాడు.
అంతేకాకుండా ఈ వ్యాధి ఉన్నవారి సెన్సెస్ చాలా స్ట్రాంగ్గా పని చేస్తాయని, ఎక్కువ లైటింగ్ చూసినా.. ఘాటైన వాసనలు పీల్చిన తాను తట్టుకోలేనని అనుదీప్ పేర్కొన్నాడు. తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుదీప్ ఈ అరుదైన వ్యాధి ఉందంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.పిట్టగోడ అనే సినిమాతో దర్శకుడుగా కెరీర్ ను ప్రారంభించిన అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. జాతిరత్నాలు సినిమాతో అనుదీప్ పేరు టాలీవుడ్ లో మోతమోగింది. ఈ సినిమా తర్వాత అనుదీప్ ఇటీవల తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే మూవీని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.