Air India : ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సెల్..రూ.1,947 కే విమాన ప్రయాణం
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఫ్రీడమ్ సేల్ను ప్రారంభించింది.
- By Latha Suma Published Date - 03:38 PM, Sun - 4 August 24

Air India Freedom Sale: ఆగస్టు 15న భారతదేశం మొత్తం 77వ స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఫ్రీడమ్ సేల్ను ప్రారంభించింది. ఇందులో ప్రయాణీకులు రూ. 1947కే ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని కోసం ఆగస్ట్ 5 వరకు ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తన 15 అంతర్జాతీయ, 32 దేశీయ మార్గాల్లోని ప్రయాణీకులకు ఈ ఆఫర్ ను అందిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇందులో ఢిల్లీ – జైపూర్, బెంగళూరు – గోవా, ఢిల్లీ – గ్వాలియర్ వంటి మార్గాలు కూడా ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
కస్టమర్లకు ఈ ఫ్రీడమ్ సేల్ ఆగస్ట్ 5, 2024 వరకు వర్తిస్తుందని ఎయిర్ లైన్ తెలిపింది. ఇంతకు ముందు బుక్ చేసుకుంటే వారు ఈ ఆఫర్ను పొందవచ్చు. దీని కోసం ప్రయాణీకులు 20 ఆగస్టు నుండి 30 సెప్టెంబర్ 2024 వరకు బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటుగా., Airindiaexpress.com లో బుక్ చేసుకునే కస్టమర్లు ప్రత్యేకమైన జీరో – చెక్ – ఇన్ బ్యాగేజ్ ఎక్స్ ప్రెస్ లైట్ ఫేర్ ను కూడా పొందవచ్చు. ఎక్స్ ప్రెస్ లైట్ ఛార్జీలో ఎటువంటి ఛార్జీ లేకుండా అదనపు 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకునే ఎంపిక, దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ. 1000, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు ₹1300 తగ్గింపు చెక్ ఇన్ బ్యాగేజీని పొందే ఎంపిక కూడా చేర్చబడింది.
అంతేకాక..విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సైనిక సిబ్బందికి ఈ ప్రత్యేక ఆఫర్లో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని ఎయిర్ ఇండియా తెలిపింది. దాని ప్రకారం.. అన్ని కొత్త ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ 737-8 విమానాలలో ఎక్స్ప్రెస్ బిస్ ఛార్జీలు అందుబాటులో ఉంటాయి.
Read Also: Wayanad Landslides : కేరళ వరద బాధితులకు మెగా హీరోల సాయం