HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >8th Pay Commission Central Govt Employees May See 186 Jump In Salary Announcement Likely In Budget

8th Pay Commission: ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. భారీగా పెర‌గ‌నున్న జీతాలు!

8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ మీడియా నివేదికల ప్రకారం.. 2025-26 బడ్జెట్‌లో దీనిని ప్రకటించవచ్చు.

  • By Gopichand Published Date - 09:45 AM, Sat - 23 November 24
  • daily-hunt
Runamafi
Runamafi

8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. త్వరలో ఉద్యోగుల‌ జీతం 186 శాతం పెరిగే అవకాశం ఉంది. నిజానికి 8వ వేతన సంఘం (8th Pay Commission) గురించి గత కొన్ని రోజులుగా ప్రజల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రతి ఉద్యోగి దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నివేదికల ప్రకారం.. 8వ వేతన సంఘం అమలులోకి వస్తే కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం 186 శాతం పెరగవచ్చు. ఇప్పుడు 7వ వేతన సంఘం ప్రకారం.. ఉద్యోగుల మూల వేతనం నెలకు రూ.18,000. స్పెషల్ పే కమిషన్ నుంచి రూ.7000 పెంచారు.

7వ వేతన సంఘం అమలులోకి వచ్చి నేటికి ఎనిమిదేళ్లు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. సంభావ్య ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ప్రకారం కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.51,480కి పెరగవచ్చు. పెన్షనర్లకు కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద జీతం చెల్లిస్తున్నారు, ఇందులో కనీస మూల వేతనం రూ. 18,000. ఇంతకుముందు 6వ పే కమిషన్ కింద ఈ బేసిక్ జీతం రూ. 7,000. ప్రతి కొత్త వేతన సంఘం అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెద్దఎత్తున దూసుకుపోతున్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 8వ వేతన సంఘం అమలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 186% వరకు పెరగవచ్చు.

Also Read: Iconic Bridge : తెలంగాణ-ఏపీ బార్డర్‌లో కృష్ణా నదిపై నాలుగు లేన్ల భారీ వంతెన

కనీస జీతం, పెన్షన్ ఎంత ఉంటుంది?

8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86ను అమలు చేసే అవకాశం ఉందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జేసీఎం) కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ. 51,480కి పెరుగుతుంది. అదేవిధంగా, పింఛనుదారులకు కూడా పెద్ద ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత కనీస పెన్షన్ రూ. 9,000. ఇది 186% పెరిగి రూ. 25,740కి చేరవచ్చు. ఇది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గణనపై ఆధారపడి ఉంటుంది. దానిని పెంచడం వల్ల జీతం, పెన్షన్‌లో మరింత పెరుగుదలకు దారితీయవచ్చు.

8వ వేతన సంఘం ప్రకటన వెలువడే అవకాశం ఉంది

8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ మీడియా నివేదికల ప్రకారం.. 2025-26 బడ్జెట్‌లో దీనిని ప్రకటించవచ్చు. గతంలో 2024-25 బడ్జెట్‌లో కూడా ఈ డిమాండ్లు లేవనెత్తగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025-26 Budget
  • 7th pay commission
  • 8th Pay Commission
  • bjp
  • central govt
  • Central Govt Employees
  • Modi Cabinet
  • pm modi
  • salary

Related News

Bhatti Vikramarka

Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

సింగరేణి కార్మికులకు 400 కోట్ల రూపాయల బోనస్ ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బందులో యావత్ ప్రజానీకం, సకల వర్గాలు పాల్గొనాలి ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు కోసం బిజెపి నాయకులు సమయం తీసుకోండి సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చాక చర్చించి ఈనెల 23న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటాం మీడియా

  • Folk Singer Maithili Thakur

    Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

  • PM Modi

    PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

  • Bihar Elections

    Bihar Elections : బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

Latest News

  • Tata Nexon: బంప‌రాఫ‌ర్‌.. ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు త‌గ్గింపు!

  • IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

  • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd