New Bikes: ఈ నెలలో కొత్తగా వస్తున్న బైక్స్ ఇవే.. పూర్తి వివరాలు మీకోసం?
మార్కెట్లో ఇప్పటికే ఎన్నో రకాల కంపెనీ ల ద్విచక్ర వాహనాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సరికొత్త మోడల్స్ తో
- By Nakshatra Published Date - 09:15 AM, Fri - 5 August 22
మార్కెట్లో ఇప్పటికే ఎన్నో రకాల కంపెనీ ల ద్విచక్ర వాహనాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సరికొత్త మోడల్స్ తో ఎప్పటికప్పుడు ఆయా కంపెనీలో మార్కెట్లోకి కొత్త కొత్త రకాల ద్విచక్ర వాహనాలను విడుదల చేస్తూనే ఉన్నాయి. కొనుగోలుదారులను ద్రుష్టిలో ఉంచుకొని ఆయా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో వాహనాలను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది ఆగస్టులో భారత మార్కెట్లో కొత్త బైకులు సందడి చేయబోతున్నాయి.
పలు రకాల ద్విచక్ర వాహన తయారీ దిగ్గజాలు తమ నూతన మోడల్ లను ఈ నెలలోనే విడుదల చేయనున్నాయి.వాటిలో టీవీఎస్ రోనిన్, బజాజ్ పల్సర్ ఎన్160, రాయల్ ఎన్ ఫీల్డ్ న్యూ బుల్లెట్, హంటర్ బైకులు, హోండా బిగ్ వింగ్, హీరో ఎక్స్ పల్స్ 200టీ, హార్లే డేవిడ్సన్ నైట్ స్టర్, డుకాటి స్ట్రీట్ ఫైటర్ వీ2, డుకాటీ పనిగేల్ వీ4 లాంటి బైకులు ఆగస్టు నెలలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా జోంటెస్, మోటో మారిని కంపెనీల బైకులు కూడా భారత మార్కెట్ లో సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నాయి. జోంటెస్, మోటో మారిని కంపెనీల బైకులు భారత్ కు పూర్తిగా కొత్తవి అన్న విషయం తెలిసిందే.
జోంటెస్ కు చెందిన ఐదు మోడళ్ల బైకులు అన్నీ 350 సీసీ సెగ్మెంట్ కు చెందినవే. భారత్ లో బెనెల్లీ, కీవే బైకులను ప్రవేశపెట్టిన ఆరీ సంస్థతో భాగస్వామ్యం ద్వారా ఈ బైకులు భారత్ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఇక మోటో మారిని నాలుగు మోడళ్లను తీసుకువస్తుండగా, అన్నీ కూడా 650 సీసీ ట్విన్ సిలిండర్ ప్లాట్ ఫామ్ పై తయారు అయినవే.
Related News
Telugu Students: స్కాట్లాండ్ లో దారుణం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Telugu Students: యూకేలోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు స్కాట్లాండ్ లోని అందమైన జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22)గా గుర్తించారు. పెర్త్ షైర్ లోని అథోల్ లోని బ్లెయిర్ సమీపంలోని లిన్ ఆఫ్ తుమ్మెల్ వద్ద బుధవారం రాత్రి విహారయాత్రకు వెళ్లిన స్నేహితుల బృందంలోని ఇద్దరు వ్యక్తులు నీటిలో పడి ఇబ్బందులు ఎద�