HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Leaders Sensational Commments On Tdp Members

TDP vs YSRCP: అసెంబ్లీలో ర‌గ‌డ‌.. టీడీపీ త‌మ్ముళ్ళ‌పై.. వైసీపీ నేతలు షాకింగ్ కామెంట్స్..!

  • Author : HashtagU Desk Date : 23-03-2022 - 2:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp Ysrcp
Tdp Ysrcp

అసెంబ్లీలో టీడీపీ నేత‌ల తీరు ఏమాత్రం మార‌లేదు. ఈరోజు అసెంబ్లీ సెష‌న్ ప్రారంభ‌మ‌వ‌గానే, టీడీపీ నేత‌లు స‌భ‌లో ఈలలు వేస్తూ, చిడ‌త‌లు వాయించారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఐదుగురు టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేశారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, జోగేశ్వరరావు, గణబాబును స్పీకర్ రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు.

సభా కార్యక్రమాలకు ప‌దే ప‌దే ఆటంకం కలిగిస్తున్నారని, స‌భ‌లో ఈల‌లు వేయ‌డం, చిడ‌త‌లు వాయించ‌డం వంటివి సభ గౌరవ మర్యాదలను కించపర్చే విధంగా ఉన్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స్పీకర్ త‌మ్మినేని, టీడీపీ స‌భ్యుల‌ను ప‌లుసార్లు హెచ్చరించినా విన‌క‌పోవ‌డంతో, టీడీపీ సభ్యుల‌ను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. అంతే కాకుండా టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీ విచారించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేప‌ధ్యంలో ఎథిక్స్ కమిటీ విచారించి తగిన చర్యలను సూచించాలని స్పీకర్ కోరారు. స్పీకర్ పైనే కాగితాలు చించి విసిరేయడం, ఈలలు వేయడం, చిడతలు వాయించడం వంటివి స్పీకర్ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఎథిక్స్ కమిటీ సూచనల మేరకు చర్యలు ఉంటాయని స్పీకర్ వెల్లడించారు. ఇక టీడీపీ నేత‌లు రోజుకో రీతిలో నిర‌స‌న తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం స‌భ‌లో ఈల‌లు వేస్తూ నిర‌స‌న తెలిపిన టీడీపీ స‌భ్యులు, ఈరోజు స‌భ‌లో స్పీక‌ర్ పోడియం ద‌గ్గ‌ర‌కు వెళ్ళిన కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు భ‌జ‌న చేయ‌గా, ఇంకొంద‌రు చిడ‌త‌లు వాయించారు. దీంతో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక స‌భ‌లో టీడీపీ ఎమ్మెల్యేలు చిడతలు వాయించడంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ త‌మ్ముళ్ళు అంద‌రూ చిడతలు వాయించుకోవాల్సిందేని సెటైర్ వేశారు. స‌భ‌లో నిన్న విజిల్స్‌ వేశారని, ఈరోజు చిడతలు వాయించారని, ఇక‌ రేపు సభలో ఏం చేస్తారో అంటూ అంబ‌టి రాంబాబు వ్యాఖ్య‌లు చేశారు. ఇక మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారం పై స్పందించిన వెల్లంప‌ల్లి శ్రీనివాస్ చంద్రబాబుకు చిడతలు కొట్టించుకోవడం బాగా అలవాట‌ని ఎద్దేవా చేశారు. ఆ అలవాటే టీడీపీ ఎమ్మెల్యేల‌కు వ‌చ్చింద‌ని, చిడతలతో సభలో అమర్యాదగా వ్యవహరించార‌ని, ఇలానే చేస్తే తండ్రి చంద్ర‌బాబు కొడుకు లోకేష్‌లు 2024 తర్వాత చిడతలు కొట్టుకోవాల్సిందే అని వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.

టీడీపీ స‌భ్యులు స‌భ‌లో చిడ‌త‌లు వాయించ‌డంపై స్పందించిన ఫైర్ మినిస్ట‌ర్ కొడాలి నాని మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త మద్యం బ్రాండ్స్‌కి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు ప్ర‌భుత్వ‌మే అని మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. అయితే ప్ర‌స్తుతం చంద్ర‌బాబు అల్జీమర్స్‌తో బాధపడుతున్నారని, రాష్ట్రంలో టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు, మొత్తం 240 కొత్త మ‌ద్యం బ్రాండ్స్‌కు పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబే అని కొడాలి నాని తెలిపారు. ఈ క్ర‌మంలో కొత్త‌గా ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని చంద్ర‌బాబు లాంటి వారు పరిపాలించడం, రాష్ట్ర ప్ర‌జ‌ల దురదృష్టం అంటూ కొడాలి నాని మండిప‌డ్డారు. 2024 ఎన్నిక‌ల త‌ర్వాత చంద్రబాబుతో పాటు పుత్ర‌ర‌త్నం లోకేష్ అండ్ టీడీపీ నేత‌లు, టీడీపీ కార్యాల‌యాల్లో భ‌జ‌న‌లు చేసుకుంటూ చిడ‌త‌లు వాయించుకుంటూ ఉంటార‌ని కొడాలి నాని జ్యోస్యం చెప్పారు. తెలంగాణ‌లో టీడీపీకి ఏ గ‌తి ప‌ట్టిందో అంద‌రికీ తెలిసిందేగా, త్వ‌ర‌లో ఏపీలో కూడా టీడీపీకి అదే గ‌తి ప‌డుతుంద‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Assembly Budget Session 2022
  • tdp
  • ysrcp

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd