HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Leaders Have Swallowed Crores Of Rupees Of Ttd Funds Ttd Chairman Br Naidu

TTD : కోట్లాది రూపాయాల టీటీడీ నిధులు వైసీపీ నేతలు మింగేశారు: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల టీటీడీ నిధులను అక్రమంగా మింగేశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని ప్రపంచానికి గొప్పగా తెలియజేయాల్సిన బాధ్యతను టీటీడీ నిర్వర్తిస్తోందని, అలాంటి సంస్ధపై రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారాలు చేయడం బాధాకరమన్నారు.

  • Author : Latha Suma Date : 26-08-2025 - 6:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BR Naidu
BR Naidu

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను కాపాడేందుకు టీటీడీ నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్పష్టంచేశారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంతాజ్‌ హోటల్‌ వ్యవహారం, వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నిధుల దుర్వినియోగంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల టీటీడీ నిధులను అక్రమంగా మింగేశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని ప్రపంచానికి గొప్పగా తెలియజేయాల్సిన బాధ్యతను టీటీడీ నిర్వర్తిస్తోందని, అలాంటి సంస్ధపై రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారాలు చేయడం బాధాకరమన్నారు.

Read Also: Heavy rains : జమ్మూకశ్మీర్‌లో జల ప్రళయం.. వైష్ణోదేవి యాత్ర నిలిపివేత

తిరుమలకు ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని ముంతాజ్‌ హోటల్‌కు కేటాయించడం వైసీపీ ప్రభుత్వపాలనలో జరిగిన ఘోరమైన తప్పు అని ఆయన పేర్కొన్నారు. పవిత్రతకు ప్రతీకగా ఉన్న తిరుమలలో వాణిజ్యపరమైన హోటల్‌ నిర్మాణం తగదని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. అదే సమయంలో, హోటల్ యాజమాన్యాన్ని ఒప్పించి మరో ప్రాంతంలో 25 ఎకరాల భూమిని కేటాయించేలా సర్దుబాటు చేయడం చంద్రబాబు ఆలోచనాశీలి నాయకుడిగా తీసుకున్న సత్సిద్ధతని నాయుడు వివరించారు. టీటీడీ భూములను ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఇదంతా వైసీపీ నాయకుల పక్కా రాజకీయ కుట్ర అని అన్నారు. టీటీడీ వ్యవహారంలో సీబీఐ విచారణ జరపాలని కోరుతున్న వైసీపీ నేతలు మళ్లీ మల్టీప్లెక్స్‌ కామెడీ చేస్తున్నట్లే ఉంది అంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలోనే కాదు, భూకబ్జాల్లోనూ పాలుపంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ముంతాజ్‌ హోటల్‌కు భూములు అప్పగించేందుకు అజయ్‌ అనే వ్యక్తిని బెదిరించిన ఘనత కూడా జగనే సాధించాడు. పాయింట్‌బ్లాంక్‌ రేంజ్‌లో తుపాకితో బెదిరించిన ఘటనను తేల్చాలి. ఇది చిన్న విషయం కాదు. విచారణ జరిపితే నిజాలు బహిర్గతమవుతాయి అని నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో నివసించేందుకు భూమన కరుణాకర్‌రెడ్డి అనర్హుడని, అలాంటి వ్యక్తులను తిరుపతిలో తిష్తాపెట్టనివ్వకూడదని అన్నారు. తిరుపతి పవిత్రతను కాపాడుకోవాలంటే ఇటువంటి దుర్మార్గులను నగరం నుంచి తరిమికొట్టాలి అని ఆయన పేర్కొన్నారు. చివరగా, టీటీడీ బోర్డు కొత్తగా వచ్చిన తర్వాత అవినీతికి తావులేకుండా పారదర్శకంగా, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయకుండా వ్యవహరిస్తోందని నాయుడు తెలిపారు. శ్రీవారి సేవలో వుంటూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, రాజకీయప్రేరిత నిర్ణయాలకు తావులేని విధంగా మేము పని చేస్తున్నాం. ఇది భక్తులకే కాదు, ప్రజలకూ తెలియాల్సిన విషయం అని పేర్కొన్నారు.

Read Also: Gautam Gambhir: ఆసియా కప్‌కు ముందు గౌతమ్ గంభీర్‌కు భారీ షాక్‌!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhumana karunakar reddy
  • Misuse of public funds
  • Mumtaz Hotel issue
  • ttd
  • TTD Chairman BR Naidu
  • TTD funds
  • ysrcp

Related News

116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

TTD: 116 ఏళ్ల బామ్మకు శ్రీవారి దివ్య దర్శనం.. ఆదేశాలు జారీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం 116 ఏళ్ల బామ్మ కాలినడకన వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నడక మార్గంలో వెళుతుండగా.. ఒక భక్తురాలు వీడియో తీసి పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఈ వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఆ బామ్మ 116 ఏళ్ల వయస్సులోనూ కాలినడకన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారని.. ఆ భ

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • 116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

    TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd