YSRCP : వైసీపీ ఐదో జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేతలు
వైసీపీలో ఐదో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీటు ఎవరికి వస్తుందో.. ఎవరికి పోతుందో అన్న టెన్షన్ నేతల్తో నెలకొంది.
- By Prasad Published Date - 09:57 AM, Sun - 21 January 24
వైసీపీలో ఐదో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీటు ఎవరికి వస్తుందో.. ఎవరికి పోతుందో అన్న టెన్షన్ నేతల్తో నెలకొంది. ఇప్పటికే నాలుగు జాబితాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చిన వైసీపీ మరికొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను మార్చే ఆలోచనలో ఉంది. ఐదో జాబితా మరో రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. రిలీజ్ చేసిన నాలుగు జాబితాల్లోని పలు నియోజకవర్గాలపై అధిష్టానం పునరాలోచన చేస్తుంది. వాటిపై రీ సర్వే చేయించేందుకు సిద్ధమైంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోషల్ ఇంజినీరింగ్పై దృష్టి సారించారు. 2019 ఎన్నికలలో వైసీపీకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో వారికి ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆయన భావిస్తున్నారు. 21 మంది ఎస్సీలు, 3 ఎస్టీలు, 17 మంది బీసీలు, 4 మైనారిటీలు, 13 అగ్రవర్ణాలకు చెందిన 58 మంది అసెంబ్లీ ఇన్ఛార్జ్ల పేర్లను వైఎస్సార్సీపీ ఇప్పటివరకు విడుదల చేసింది. 10 మంది లోక్సభ ఇన్ఛార్జ్లలో ఆరుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఓసీ ఒకరు ఉన్నారు. జనవరి 25 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని సీఎం భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల్లో అభ్యర్థుల ఐదో జాబితాను ప్రకటించాలనుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మంత్రులు, శాసనసభ్యులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని సందర్శిస్తూ తమ భవితవ్యాన్ని తెలుసుకుంటున్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు డి. చంద్రశేఖర్, ఎం. వేణుగోపాల్, జి. శ్రీకాంత్రెడ్డి తదితరులు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎంవోలో ఉన్న ముఖ్య నేతల్ని కలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలోకి మారడంతో మచిలీపట్నంకు కొత్త అభ్యర్థిని ఎంపిక చేసేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గుంటూరుకు మారడం ఇష్టం లేకపోవడంతో జగన్ పునరాలోచన చేస్తే నరసరావుపేట ఎంపీ స్థానానికి బీసీ అభ్యర్థిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు ఎంపీ స్థానం నుంచి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లేదా సినీ నటుడు అలీని పోటీకి దింపాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. రాజమండ్రి ఎంపీ సీటుకు బీసీ అభ్యర్థి లేదా ప్రముఖ తెలుగు సినీ దర్శకుడిని నామినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, నర్సాపురం, బాపట్ల ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జ్లను ఖరారు చేసే అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి.
Also Read: CBN : దళితులపై నేరాలు, ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా?
Related News
CM Jagan: ప్రముఖ దర్శకుడిని మోసం చేసిన సీఎం జగన్
ఆర్. నారాయణ మూర్తి గతంలో సీఎం జగన్ ని కలిశారు. ఈ భేటీలో సినిమా పరిశ్రమ గురించి మాత్రమే కాకుండా తన ఊరులో నీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ కి మొరపెట్టుకున్నారు. సీఎం జగన్ కూడా వెంటనే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేశారు.