YS Jagan : ఉగాది నుంచి జగన్ కొత్త పాలన
- By Hashtag U Published Date - 04:48 PM, Sat - 12 February 22
‘మూడు రాజధానులు చేసి తీరుతాం. త్వరలోనే బిల్లు బిల్లు పెట్టబోతున్నాం. ‘ అంటూ తాజాగా మంత్రి కొడాలి నాని వెల్లడించాడు. ఆ లోపు కొత్త జిల్లాల ఏర్పాటు కూడా పూర్తి చేయడానికి ఆదేశాలు జగన్ జారీ చేసాడు. ఒక వైపు జగన్ ఇంకో వైపు కొడాలి మాటలు వింటుంటే విశాఖ రాజధాని తప్పదు అని అర్థం అవుతోంది.ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ మేరకు మార్చి 18 నాటికే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. మార్చి 17లోపు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వర్తిస్తారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు ఉద్యోగులు, అధికారులను కేటాయించే వరకు పాత జిల్లాల బాధ్యతలను కూడా వీరే చూసుకుంటారు.
పాత జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చినా విభజన, మౌలిక వసతుల కల్పన వంటి వాటిని వీరే పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్లు, సవరణ ఉత్తర్వులపై జిల్లాల కలెక్టర్లు ప్రజల నుంచి సలహాలు, సూచనలను మార్చి 3వ తేదీ వరకు స్వీకరిస్తారు. వీటిని పదో తేదీ వరకు పరిశీలించి తర్వాతి రోజు నివేదిక రూపంలో వివరాలను సచివాలయంలోని బిజినెస్ నిబంధనలు రూపొందించే వారి పరిశీలనకు పంపిస్తారు. మార్చి 15 నుంచి 17 మధ్య తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనికి అనుగుణంగా 18న జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఉగాది నుంచి విశాఖ నుంచి పాలన సాగేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
Tags
Related News
YS Jagan : 2 నెలల్లో 21000 కోట్ల రుణం… జగన్ ఘనతే..!
వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఐదేళ్లలో అభివృద్ధి కంటే అప్పులు చేసిందన్నారు.