HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Motorists In Ap Vehicle Registration Within 24 Hours

ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్ 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 08-05-2026 - 2:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Transport Department
Ap Transport Department

ఏపీలో 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణాశాఖ 24 గంటల్లోగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆటోమేటిక్‌గా 24 గంటల తర్వాత ఆమోదం పొందినట్లే లెక్క. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి వేచి ఉండే పనిలేకుండా 24 గంటల్లోనే పూర్తి చేసేలా కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం, ఎవరైనా కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే డీలర్‌ తాత్కాలిక (టెంపరరీ) రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఆ తర్వాత రవాణాశాఖ ఆమోదం తెలిపితే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానంలో ప్రజలు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై అధికారులతో చర్చించారు. రాబోయే రోజుల్లో వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఆలస్యం లేకుండా వాహనదారులకు వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన రవాణాశాఖ 24 గంటల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఏపీ ప్రభుత్వం వారం రోజుల్లో ఆమోదిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 వేల వాహనాల వరకు రవాణాశాఖ అధికారుల దగ్గర పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి నిర్ణీత గడువు లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు.

ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానం అమల్లోకి వస్తే, రవాణాశాఖ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేవలం 24 గంటల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. డీలర్ దగ్గర వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత టెంపరరీ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత ఫ్యాన్సీ నంబరు కోసం దరఖాస్తు చేసుకున్నవారు మినహా మిగిలిన అందరి వాహనాల రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌లను రవాణాశాఖ అధికారులు 24 గంటల్లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. పర్మినెంట్ (శాశ్వత) రిజిస్ట్రేషన్ ప్రక్రియ, నంబర్ జనరేట్ చేయడం గడువులోపే పూర్తి చేయాలి. ఒకవేళ 24 గంటల్లోపు అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే, ఆ వెంటనే ఆటోమెటిక్‌గా (24 గంటల తర్వాత) రిజిస్ట్రేషన్‌కు ఆమోదం లభిస్తుంది. ఒకవేళ సెలవు రోజులు ఉంటే, ఆ రోజు కూడా ఆన్‌లైన్‌లో అధికారులు ఆమోదం తెలిపే అవకాశం కల్పిస్తారు.

అలాగే వాహన డీలర్‌కు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో పాటు శాశ్వత రిజిస్ట్రేషన్ అధికారాన్ని అప్పగించే అంశాన్ని ముందు పరిశీలించారు. ఇలా చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని, ఆ శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారం రవాణాశాఖ అధికారుల దగ్గర మాత్రమే ఉండాలని అధికారులు తేల్చి చెప్పారు. ఆ తర్వాత 24 గంటల్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసే ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపారు. అక్కడ నుంచి ఆమోదం రాగానే 24 గంటల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu Naidu
  • AP government
  • AP Transport Department
  • New Vehicle Registration
  • RTA
  • Vehicle Registration

Related News

Good news from the government for those waiting for pensions.

Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 2.20 లక్షల మందికి వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అర్హులైన మహిళలకు రాబోయే ఒకటి రెండు నెలల్లో ప్రతి నెలా రూ. 4 వేల చొప్పున పింఛను అందించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏప

  • Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.

    Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • CM Chandrababu launches the book 'CBN@361 Degrees' in Singapore.

    Chandrababu Naidu: సింగపూర్‌లో సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

  • Chandrababu

    Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

  • The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

    Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

Latest News

  • TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Anupama Singh: కాశ్మీర్ జోలికొస్తే ఊరుకోం.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

  • Sreesanth: ఆమె లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని : శ్రీశాంత్‌

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd