YS Jagan : యువతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…!
ఏపీ ప్రభుత్వం పేదింటి యువతులకు శభవార్త చెప్పింది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పెళ్లి కానుక నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- By hashtagu Published Date - 03:39 PM, Sat - 27 November 21
ఏపీ ప్రభుత్వం పేదింటి యువతులకు శభవార్త చెప్పింది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పెళ్లి కానుక నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పెళ్లి కానుక ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం పెంచింది.ఇది వచ్చే ఏడాది శ్రీరామనవమి నుంచి అమలుకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పెళ్లి కానుకల కోసం నిధులు విడుదల చేసింది. త్వరలోనే ఈ డబ్బు అకౌంట్లలో జమ కానున్నాయి. గ్రామాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత అర్హత సాధించిన వారికి డబ్బులు జమకానున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లలకు మరింత సాయం చేసేందుకు జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇఛ్చినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న ప్రోత్సాహకాన్నిపెంచింది.దీనికి వైఎస్సార్ పెళ్లి కానుకగా నామకరణం చేసి అందజేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. గతంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు పెళ్లి కానుక కింద అందజేశారు. ఇప్పుడు పెంచిన ప్రోత్సాహకం ప్రకారం వైఎస్సార్ పెళ్లి కానుక కింద అర్హులైన వారందరికీ లక్ష రూపాయలు రానున్నాయి.
ఎస్సీ,ఎస్టీ కులాంతర వివాహాలకు ఇస్తున్న రూ.75 వేలను ఇప్పుడు రూ.1.20 లక్షలు చేశారు. బీసీ యువతులకు ఇస్తున్న రూ.35 వేలను రూ.50 వేలకు.. కులాంతర వివాహాలు చేసుకొనేవారికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైనార్టీలకు రూ.50 నుంచి రూ.లక్షకు.. దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు ప్రోత్సాహకాలను పెంచారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల పెళ్లి కానుకను కూడా జగన్ సర్కార్ పెంచింది. వారికి రూ.20 వేల నుంచి రూ.లక్షకు చేరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఆగ్రవర్ణ పేదలు ఎవరైనా భవన నిర్మాణ కార్మికులగా పనిచేస్తూ, కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే వారింట్లో ఆడపడుచులకు పెళ్లి కానుక పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికు కుటంబాలకు సాయం చేస్తున్నా.. వారు అవగాహన లోపంతో సాయానికి దూరమవుతున్నారని అధికారులు అంటున్నారు.
భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకొనే వారి సంఖ్య తక్కువగా ఉన్నారని… ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మాత్రమే పెళ్లి కానుక దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. భవన నిర్మాణ కార్మికులు దగ్గర్లోని ఆసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత పత్రాలు, తగిన రుసుం చెల్లించి గుర్తింపు కార్డు పొందవచ్చని ఆధికారులు చెబుతున్నారు. గుర్తింపు కార్డు వచ్చిన వారు పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తానికి రాష్ట్రంలో పెళ్లి కానుక పథకం తిరిగి ప్రారంభం కావడంతో పెదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు కొంత చేదోడు వాదోడుగా డబ్బులు ఉపయోగపడనున్నాయి.
Related News
Andhra Pradesh: తిరుమలలో కార్చిచ్చు.. దగ్దమైన శ్రీ గంధం చెట్లు
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.