Srinivas Varma : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
Srinivas Varma : తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయ ప్రస్థానం ముఖ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ నుంచి అనేక మంది ప్రముఖ నేతలు రాణించారని తెలిపారు. ఆయన సమక్షంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ బాధ్యతలు స్వీకరించారు.
- By Kavya Krishna Published Date - 07:29 PM, Fri - 14 February 25

Srinivas Varma : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎలాంటి ఆలోచన లేదని కేంద్ర ఉక్క శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని అత్యుత్తమ స్టీల్ ప్లాంట్లలో విశాఖకు ప్రత్యేక స్థానం ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గౌరవించి కేంద్రం రూ.11,400 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేటాయించిందని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితోనే ఈ ప్రత్యేక ప్యాకేజీ సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్లాంట్ను లాభాల్లోకి తీసుకురావడానికి కేంద్రం సహకారంతో ముందడుగు వేస్తుందని హామీ ఇచ్చారు.
ఇటీవల కేంద్ర ఉక్క శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. సిబ్బందితో సమావేశం సందర్భంగా ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా భరోసా ఇచ్చారు. పర్యటనలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కూడా పాల్గొన్నారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు.
BRS : 17న పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు : తలసాని
2019లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. కానీ, ఆ సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరపలేకపోయిందని విమర్శలు వచ్చాయి. వైసీపీ ఎంపీలు సైతం ప్రైవేటీకరణపై కేంద్రాన్ని నిలదీయలేదని విశాఖ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆందోళనల సమయంలో కూడా ప్రభుత్వ మద్దతు కనబడలేదని స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమికి మద్దతు ఇచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేంద్ర దృష్టిని రాష్ట్రానికి తీసుకువచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం కేంద్రం భారీ నిధులు కేటాయిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయడానికి చొరవ తీసుకుంటోంది. కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా స్టీల్ ప్లాంట్ను లాభదాయక స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ పరిణామాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి.
Thummala Nageswara Rao : రుణాలు ఎగ్గొడుతున్న పెద్దలపై ఎందుకిలా మౌనం? బ్యాంకర్లపై మంత్రి తుమ్మల ఫైర్