HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Two New Vande Bharat Trains For Telugu States

Vande Bharat trains : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు

Two new Vande Bharat trains: సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ -హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

  • Author : Latha Suma Date : 13-09-2024 - 6:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Two new Vande Bharat trains for Telugu states
Two new Vande Bharat trains for Telugu states

Two new Vande Bharat trains: కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రయాణించే వందేభారత్ రైళ్ల సంఖ్య మరింత పెరగనుంది. సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ -హైదరాబాద్, దుర్గ్ – విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్లు అనుసంధానత కలిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.

Read Also: రోహిత్ కెప్టెన్సీపై స్టార్ బౌలర్ క్రేజీ స్టేట్మెంట్

మరోవైపు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వయో వృద్ధుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆపన్నహస్తం అందించారని కిషన్ రెడ్డి తెలిపారు. 70 ఏళ్లు దాటిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించారన్నారు. పేద, ధనిక తేడా లేకుండా 6 కోట్ల మంది వయోవృద్ధులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఈ పథకంపై రూ. 3,437 కోట్లను కేంద్రం ఖర్చ చేయనుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అదనంగా మరో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి జరగనుందని కిషన్ రెడ్డి తెలిపారు. 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులందరికీ ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ఇప్పటికే ఆయుష్మాన్ పరిధిలో ఉన్న కుటుంబాల్లో 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అదనంగా ఏడాదికి రూ. 5 లక్షల టాప్-అప్ కవర్ ఇవ్వనుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో వయోవృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వయో వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

Read Also: Team India Unlucky Players: టీమిండియాలో దురదృష్టానికి కేరాఫ్ వాళ్లిద్దరే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Durg - Visakhapatnam
  • Nagpur - Hyderabad
  • pm modi
  • telangana
  • Union Minister Kishan Reddy
  • vande bharat trains

Related News

Cashless Care

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్‌ వైద్యం!

నేషనల్ హైవేల (NH) పై ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒకసారి ‘ఎమర్జెన్సీ కాంటాక్ట్ బోర్డులు’ ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై దగ్గరలోని క్యాష్‌లెస్‌ ఆసుపత్రుల దూరం, ఫోన్ నంబర్లు ఉంటాయి.

  • Bhatti Nirmala Sitharaman

    ప్రీ బడ్జెట్ సమావేశం, నిర్మలమ్మ కు భట్టి విజ్ఞప్తులు

  • Revanth Govt Movie Tickets

    సినిమా టికెట్ ధరల విషయంలో పదే పదే మాట మారుస్తూ విమర్శలు ఎదురుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • Sankranthi Toll Gate

    సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులకు బ్యాడ్ న్యూస్ !

Latest News

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

  • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

  • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd