Vande Bharat trains : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
Two new Vande Bharat trains: సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్పూర్ -హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
- By Latha Suma Published Date - 06:46 PM, Fri - 13 September 24

Two new Vande Bharat trains: కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు మరో గుడ్న్యూస్ చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రయాణించే వందేభారత్ రైళ్ల సంఖ్య మరింత పెరగనుంది. సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్పూర్ -హైదరాబాద్, దుర్గ్ – విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్లు అనుసంధానత కలిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
Read Also: రోహిత్ కెప్టెన్సీపై స్టార్ బౌలర్ క్రేజీ స్టేట్మెంట్
మరోవైపు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వయో వృద్ధుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆపన్నహస్తం అందించారని కిషన్ రెడ్డి తెలిపారు. 70 ఏళ్లు దాటిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించారన్నారు. పేద, ధనిక తేడా లేకుండా 6 కోట్ల మంది వయోవృద్ధులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఈ పథకంపై రూ. 3,437 కోట్లను కేంద్రం ఖర్చ చేయనుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అదనంగా మరో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి జరగనుందని కిషన్ రెడ్డి తెలిపారు. 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులందరికీ ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ఇప్పటికే ఆయుష్మాన్ పరిధిలో ఉన్న కుటుంబాల్లో 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అదనంగా ఏడాదికి రూ. 5 లక్షల టాప్-అప్ కవర్ ఇవ్వనుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో వయోవృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వయో వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.