HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Thalliki Vandanam Scheme From The Coming Academic Year

Talliki Vandanam Scheme : రాబోయే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ – కేబినెట్ నిర్ణయం

Thalliki Vandanam Scheme 2025 : వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించారు

  • By Sudheer Published Date - 03:45 PM, Thu - 2 January 25
  • daily-hunt
Talliki Vandanam Scheme
Talliki Vandanam Scheme

రాబోయే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ (Talliki Vandanam Scheme) అమలు చేయాలనీ ఏపీ కేబినెట్ (AP Cabinet) నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 14 అంశాల ఎజెండాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

కాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 నిధులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పథకానికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ఖరారు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.

Local body elections : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఆర్థికంగా పేద కుటుంబాలకు పెద్ద రిలీఫ్ ఉంటుంది. ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా అందరికీ ఈ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థుల విద్య కోసం ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం అమలు చేసే సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు పేద కుటుంబాల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ పథకం ద్వారా పిల్లలకు విద్యా వృద్ధి పథకాలను పూర్తి చేయడం, విద్యా కృత్యాలను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

ఈ పథకం ఆమోదం తో పాటు కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు (Key Decisions taken by the Cabinet) చూస్తే..

* గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నదింపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాలు స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐసీ ఆస్పత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

* ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదముద్ర

* రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం

* రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎన‌ర్జీలో రూ.83 వేల కోట్ల పెట్టుబడుల‌కు గ్రీన్ సిగ్నల్

* విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ.80 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం

* శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం రూ.1,046 కోట్ల పెట్టుబడుల‌కు ఆమోదం

* అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబ‌డుల‌కు గ్రీన్ సిగ్నల్

* చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై చ‌ర్చ

* సీఎం చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్ట్‌పై చర్చ

అలాగే ఈనెల 8వ తేదీన ప్రధాని రాష్ట్రానికి రానున్న తరుణంలో ఈ పర్యటనపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. ప్రధాని మోదీ విశాఖలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక నరేంద్ర మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

Mahesh : రాజమౌళి కోసం సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్..!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP Cabinet Meeting
  • CM Chandrababu
  • financial assistance
  • Thalliki Vandanam Scheme
  • Thalliki Vandanam Scheme 2025

Related News

Ips Sanjay

IPS Sanjay : ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

IPS Sanjay : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ (IPS Sanjay) రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది

  • Star Hotel

    Amaravati Hotels : అమరావతికి స్టార్ హోటళ్ల కళ

  • Vizag It Capital

    Investments in Vizag : విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

  • AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

    CM Chandrababu London : నవంబర్లో లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు

  • Cbn Google

    Google : అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్ – చంద్రబాబు

Latest News

  • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

  • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

Trending News

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd