HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Telugu States Should Use The Water That Meets The Sea It Is Good For The Farmers Cm Chandrababu

CM Chandrababu : సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకోవాలి.. రైతాంగానికి మేలు: సీఎం చంద్రబాబు

శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశాను. రాయలసీమ రతనాల సీమగా మారాలని ప్రార్థించాను. మల్లన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారుతుంది. జలాలే మన అసలైన సంపద. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు. రైతన్నల బాధలు తీరేందుకు ఇవే మార్గం అని చెప్పారు.

  • By Latha Suma Published Date - 06:03 PM, Tue - 8 July 25
  • daily-hunt
Telugu states should use the water that meets the sea.. It is good for the farmers: CM Chandrababu
Telugu states should use the water that meets the sea.. It is good for the farmers: CM Chandrababu

CM Chandrababu : నా జీవితంలో ఈరోజు అనిర్వచనీయమైన ఆనందకరమైన రోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జులై మొదటి వారంలోనే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండడాన్ని ఆయన శుభసూచకంగా అభివర్ణించారు. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం జరిగిన నీటి వినియోగదారుల సమావేశంలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశాను. రాయలసీమ రతనాల సీమగా మారాలని ప్రార్థించాను. మల్లన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారుతుంది. జలాలే మన అసలైన సంపద. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు. రైతన్నల బాధలు తీరేందుకు ఇవే మార్గం అని చెప్పారు.

Read Also: Umpire Bismillah: క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. 41 ఏళ్ల‌కే అంపైర్ క‌న్నుమూత‌!

శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 200 టీఎంసీల నీరు ఉన్నట్లు తెలియజేసిన సీఎం, ఇది రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమకు ఎంతో ఊరటనిచ్చే అంశమని చెప్పారు. గతంలో రాయలసీమ అభివృద్ధికి ఎంతో మంది శ్రద్ధ చూపలేదని పేర్కొంటూ, స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన మార్గాన్ని తాను కొనసాగిస్తున్నానని చెప్పారు. రాయలసీమను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూ. 68 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశాం అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు వారు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను పట్టించుకోలేదు. ఇప్పుడైనా ఆ ప్రాంత ప్రజలకు మేలు జరగాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. జీడిపల్లికి నీరు తరలించేందుకు అధికారులకు జూలై 15వ తేదీని టార్గెట్‌గా పెట్టాం. నెలాఖరులోగా కుప్పం, మదనపల్లెలకు కూడా నీరు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని వెల్లడించారు. పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, గండికోట వంటి ప్రధాన ప్రాజెక్టులను తెచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్లే రాయలసీమకు నీటి ప్రవాహం జరుగుతోందని చెప్పారు.

రాయలసీమ అభివృద్ధికి నా వద్ద స్పష్టమైన బ్లూప్రింట్ ఉంది. ఇది కేవలం నీటిపరిమితికి మాత్రమే కాదు, పారిశ్రామిక, వ్యవసాయ, ఆరోగ్య పరంగానూ సాగుతుంది అని వివరించారు. ప్రాంతీయ అభివృద్ధి విషయానికొస్తే దేశంలో ఎక్కడా లేని సుశృంఖల రోడ్డు వ్యవస్థ రాయలసీమలో ఉంది. కొప్పర్తి, ఓర్వకల్లు లాంటి ప్రాంతాలు పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి అని పేర్కొన్నారు. ఆహారంలో మార్పును కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో మేము రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు తినేవాళ్లం. ఇప్పుడు పాలిష్డ్ రైస్ తినడం వల్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ చిరుధాన్యాలవైపు ప్రజలు తిరుగుతున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. కూరగాయలు, పండ్ల వినియోగం పెరుగుతోంది. అన్ని రకాల పండ్లను పండించగల సామర్థ్యం రాయలసీమకు ఉంది అని పేర్కొన్నారు. చివరిగా తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఎదగాలన్నదే నా కల. హైదరాబాద్‌లో కొనసాగుతున్న అభివృద్ధికి కూడా మేమే పునాది వేశాం. సముద్రంలో కలిసే నీటిని తెలుగురాష్ట్రాలు వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలకూ మేలు జరుగుతుంది అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also: CM Chandrababu : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Jalharati
  • rayalaseema development
  • srisailam project
  • telugu states
  • ysrcp

Related News

Pawan Amaravati

Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

Kutami Government : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (Dy.CM) పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం

  • New Districts In Ap

    New Districts in AP : ఏపీలో రెండు కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!

Latest News

  • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

  • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

  • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

  • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

  • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

Trending News

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd