HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Telugu States Mlc Elections Nomination Deadline Today

MLC Elections : నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వంకు తెర..

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం 20 మంది, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.

  • Author : Kavya Krishna Date : 10-02-2025 - 10:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Election Commission Of India
Election Commission Of India

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలు గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే అభ్యర్థుల తరఫున నామినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, చివరి రోజైన నేటి వరకు మరిన్ని అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యే అవకాశముంది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల పోరులో మరిన్ని అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, గుంటూరు కలెక్టరేట్‌లో పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణరావు నేడు నామినేషన్ వేయనున్నారు.

ఈనెల 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది. అనంతరం ఈనెల 27న పోలింగ్ నిర్వహించనుండగా, మార్చి 3న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 3,15,267 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 440 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

అలాగే.. కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి 85 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. చివరి రోజైన నేటి వరకు మరిన్ని అభ్యర్థులు నామినేషన్ వేయొచ్చని అంచనా వేస్తున్నారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటివరకు 17 మంది అభ్యర్థులు మొత్తం 23 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. నేడు, పీఆర్‌టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి తమ రెండో సెట్ నామినేషన్‌ను సమర్పించనున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, టీజేఏసీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఖమ్మం – నల్గొండ – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఈ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 23 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో సోమవారం చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనుండగా, బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఈ ఎన్నికల్లో తన అభ్యర్థిని నిలిపేందుకు ఆసక్తి చూపకుండా, గట్టి పోటీ ఇచ్చే స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులు
సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (యూటీఎఫ్), పింగలి శ్రీపాల్ (పీఆర్‌టీయూ) తమ అనుచరులతో కలిసి నామినేషన్లను దాఖలు చేయనున్నారు. చివరి రోజైన నేటితో ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియనుండగా, రేపటితో నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఈ ఎన్నికలు ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. చివరి రోజుల్లో నామినేషన్ ప్రక్రియ హడావుడిగా సాగుతుండగా, పోటీ కాస్త ఆసక్తికరంగా మారింది.

Viral : కిరణ్ రాయల్ అక్రమ సంబంధం ఇష్యూ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Election commission
  • graduate MLC
  • mlc elections
  • nominations
  • political news
  • Teacher MLC
  • telangana

Related News

Tgpsc Group 3 Results

గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.మొత్తం 1,388 పోస్టులకు గాను ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఓజీ డైరెక్టర్ కు పవన్ కార్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే !

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd